Mission Bhagiratha : మిషన్ భగీరథ హెడ్ ఆఫీస్ లో కాల్ సెంటర్
- మంత్రి సీతక్క ఆదేశాలతో మిషన్ భగీరథ హెడ్ ఆఫీస్ లో కాల్ సెంటర్
- మిషన్ భగీరథ టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-4007 అందుబాటులోకి
- గ్రామీణ ప్రాంతాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరాలో వచ్చే ఇబ్బందులపై ఫిర్యాదు చేసే వెసులుబాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mission Bhagiratha : పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాలతో ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ హెడ్ ఆఫీస్ లో కాల్ సెంటర్ ప్రారంభించారు. సోమవారం నుంచి మిషన్ భగీరథ టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-4007 అందుబాటులోకి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరాలో వచ్చే ఇబ్బందులపై ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించారు. సూపరిండెంట్ ఇంజనీర్ నేతృత్వంలో ఐదుగురు సిబ్బందితో 24 గంటలు పనిచేయనున్న కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పగలు వచ్చే కాల్స్ ను అటెండ్ చేసి సిబ్బంది వివరాలు నమోదు చేసుకోనున్నారు. రాత్రి వచ్చే కాల్స్ రికార్డు అవుతాయని అధికారులు తెలిపారు. ప్రతి రోజు వచ్చే ఫిర్యాదులను మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి సమీక్షించనున్నారు. 24 గంటల్లో సమస్యకు పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామని అధికారులు వివరించారు. టోల్ ఫ్రీ ద్వారా అందే ఫిర్యాదులను క్షేత్ర స్థాయికి చేరవేసి పరిష్కారానికి అవసరమైన సలహాలు సూచనలు చేయడంతో పాటు పరిష్కారం కోసం అవసరమయ్యే ఏర్పాట్లు చేయనన్నారు మిషన్ భగీరథ హెడ్ ఆఫీస్ సిబ్బంది.
Harish Rao : క్రిస్మస్ను అధికారికంగా నిర్వహించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్
Also Read
మంత్రిగా సీతక్క భాద్యతలు స్వీకరించాక మిషన్ భగీరథపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నిరంతర సమీక్షలతో మిషన్ భగీరథలో సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. మిషన్ భగీరథ నీటిపై ప్రజలకు విశ్వాసం కలిగించేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. నీటి సరఫారాలో లీకేజీలు, అవంతరాలను అరికట్టేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు మంత్రి సీతక్క. తాగు నీటి సరఫరా సజావుగా సాగేలా చూసేందుకు గ్రామాల్లో మంచి నీటి సహయకుల నియామకం చేపట్టారు. ఎలాంటి ఇబ్బందులున్నా తక్షణం రంగంలోకి దిగి మరమ్మత్తులు చేసేలా శిక్షణ పూర్తి చేశారు. మిషన్ భగీరథ సరఫరాలో ఇబ్బందులు తలెత్తితే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తాగునీటిని సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశారు. పదేండ్లు పట్టించుకోని 64,218 చేతి పంపులను, 45,882 సింగల్ ఫేజ్ మోటర్లను, 32,517 PWS (పైప్డ్ వాటర్ సప్లై) మోటర్లకు మరమత్తులు చేసి వినియోగంలోకి తెచ్చిన మిషన్ భగీరథ శాఖ.. తాజాగా మిషన్ భగీరథ కాల్ సెంటర్ ఏర్పాటుతో గ్రామీణ నీటి సరఫరా సమస్యలకు చెక్ పెట్టనుంది.
తాజావార్తలు
-
Haryana: అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు మోహిత్ హఠాన్మరణం
-
Karnataka: కర్ణాటకలో దారుణం.. యువతి కిడ్నాప్, అత్యాచారం, హత్య..
-
Raidurg Land: రాయదుర్గం TGIIC భూమికి జాక్పాట్.. ఎకరం రూ.264 కోట్లు.!
-
India Sri Lanka 2nd Test: కుల్దీప్ ఫామ్లోనే ఉన్నాడు.. టీమిండియా కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Floods: మధ్యప్రదేశ్ను ముంచెత్తిన వరదలు.. ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!