Miss India 2026 Winner: మతి పోగొట్టేసిన మిస్ ఇండియా.. గోవా సుందరి సాధ్విని వరించిన కిరీటం!
- ఫస్ట్ రన్నరప్గా మహారాష్ట్ర భామ
- భువనేశ్వర్లో ఘనంగా ముగిసిన మిస్ ఇండియా పోటీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Miss India 2026 Winner: దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘మిస్ ఇండియా 2026’ (61వ ఎడిషన్) పోటీలు శనివారం రాత్రి ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఘనంగా ముగిశాయి. ‘పుత్రికాభిమానం’ (Daughters of This Soil) థీమ్తో జరిగిన ఈ వేడుకలో గోవాకు చెందిన సాధ్వి సతీష్ సెయిల్ మిస్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకున్నారు.
READ ALSO: Lenin: అఖిల్ ‘లెనిన్’ కోసం రంగంలోకి నాగార్జున.. ఫైనల్ కట్లో మార్పులు?
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
కిరీటాన్ని అలంకరించిన నికితా పోర్వాల్
కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (KIIT) వేదికగా జరిగిన ఈ గ్రాండ్ ఫినాలేలో.. గత ఏడాది విజేత నికితా పోర్వాల్.. సాధ్వికి మిస్ ఇండియా కిరీటాన్ని అలంకరించారు. ఈ విజయంతో సాధ్వి ‘మిస్ వరల్డ్ 2027’ పోటీల్లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ప్రముఖ నటుడు మనీష్ పాల్, సారా జేన్ డయాస్ ఈ వేడుకకు వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా.. ఇషాన్ ఖట్టర్ వంటి స్టార్ల ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి.
టాప్-3 విజేతలు వీరే..
ఈ వేడుకల్లో గోవాకు చెందిన సాధ్వి సతీష్ సెయిల్ విజేతగా నిలిచారు. ఈ పోటీలో సాధ్వి సిల్వర్, బ్లాక్ కలర్ మోనోక్రోమాటిక్ గౌనులో మెరిసిపోయారు. ఆమె దుస్తులు వినూత్నంగా ఉన్నాయి. హై-నెక్, స్లీవ్లెస్ కట్ ఆమె ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాయి. ఈ పోటీలో ఫస్ట్ రన్నరప్గా మహారాష్ట్రకు చెందిన రాజనందిని పవార్ నిలిచారు. మహారాష్ట్రకు చెందిన రాజనందిని పింక్ కలర్ గౌనులో ‘మోడ్రన్ ప్రిన్సెస్’లా కనిపించారు. వెండి స్పటికాలు, రాళ్లతో అలంకరించిన ఆమె హాల్టర్-స్టైల్ గౌను, హెయిర్ స్టైల్ క్లాసిక్ లుక్ను అందించాయి. సెకండ్ రన్నరప్ శ్రీ అద్వైత నిలిచారు. శ్రీ అద్వైత గోల్డ్ కల్లర్ ఈవినింగ్ గౌనులో తళతళలాడారు. ఆమె లుక్కు సిల్వర్ ఇయర్ రింగ్స్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. అందం, తెలివితేటలు, సమయస్ఫూర్తిని ప్రదర్శించిన ఈ ముగ్గురు భామలు నేటి యువతులకు స్ఫూర్తిగా నిలిచారు. ముఖ్యంగా మిస్ వరల్డ్ వేదికపై సాధ్వి సతీష్ సెయిల్ భారత్ కీర్తిని చాటుతారని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!