Mirzapur: దుర్గామాతపై అసభ్యకర పాట పాడిన ఫోక్ సింగర్.. తెరవెనుక ఫేమస్ రచయిత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mirzapur Folk Singer Saroj Sargam Arrested: హిందూ దేవీ, దేవతలను కించపరుస్తూ మాట్లాడటం, పాటులు పాడటం సర్వసాధారణంగా మారుతోంది. తాజాగా దేశం మొత్తం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటోంది. దుర్గాదేవిని జగన్మాతగా కొలుస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కానీ.. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్కి చెందిన సరోజ్ సర్గం అనే ఫోక్ సింగర్ మాత్రం దుర్గామాతను కించపరుస్తూ పాట పాడింది. తన పాటలో విష్ణుమూర్తిని హంతకుడిగా, దుర్గమ్మను వేశ్యగా.. ప్రహ్లాదుడిని తాగుబోతుగా ఆమె అభివర్ణించింది. ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ రాయ్ ఫిర్యాదు ఆధారంగా మదిహాన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో ఈ పాట వైరల్ కావడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సహ నిందితుడైన సరోజ్ సర్గం భర్త రామిలన్ బింద్లతో పాటు బిర్హా బృందంలోని ఆరుగురు సభ్యులను అరెస్టు చేశారు. ఈ వీడియోను గాయని భర్త రామిలన్ బింద్ ఎడిట్ చేసి అప్లోడ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
READ MORE: Cancer: ప్రమాదకరమైన రోగం.. కనిపించే ప్రథమ లక్షణం.. గుర్తించకపోతే ఇక అంతే సంగతులు!
Also Read
- Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
- Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
- Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
- Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
అయితే.. తాజాగా ఈ ఘటనపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే వీరిపై అనేక కేసులు నమోదయ్యాయినట్లు పోలీసులు చెబుతున్నారు. మార్చి 23, 2025న నగర కొత్వాలి పోలీస్ స్టేషన్లో గాయని, ఆమె భర్తపై కేసు నమోదు చేశారు. సరోజ్ సర్గంపై మీర్జాపూర్తో పాటు మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో ఎనిమిది కేసులు నమోదయ్యాయి. బిర్హా బృందాన్ని గాయకుడు సరోజ్ సర్గం భర్త రాంమిలన్ బింద్ నిర్వహిస్తున్నారని పోలీసు సూపరింటెండెంట్ సోమెన్ బర్మా తెలిపారు. ఈ గాయని గత రెండున్నర నుంచి మూడు సంవత్సరాలుగా పీడీఏ (వెనుకబడిన, దళిత, మైనారిటీ) కమ్యూనిటీలపై పాటలు పాడుతున్నారు. కానీ.. తాజాగా వివాదం సృష్టించిన పాటను రచయిత రాజ్వీర్ సింగ్ యాదవ్ ఆదేశం మేరకు తాను కంపోజ్ చేశానని వెల్లడించింది. తన “బహుజన్ నాయక్ మహిషాసుర్” పుస్తకంపై ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసు గెలిచానని రాజ్వీర్ స్వయంగా ఆమెకు చెప్పాడట. కాబట్టి.. తాను భయపడాల్సిన పని లేదని.. ఈ పుస్తకం నుంచే ఈ పాట కంటెంట్ను తీసుకున్నట్లు నిందితురాలు తెలిపింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు సూత్రధారి రాజ్వీర్ సింగ్ యాదవ్ కోసం వెతుకుతున్నారు.
తాజావార్తలు
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
-
Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
-
Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
-
Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!