Minister KTR : కేసీఆర్ అంటే నమ్మకం… మోడీ అంటే అమ్మకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామగుండంలో ఏర్పాటు చేసిన దశాబ్ది ప్రగతి సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కోరుకంటి చందర్ ని తిరిగి గెలిపిస్తే రామగుండం నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానన్నారు కేటీఆర్. ప్రధాని ఏ మొహం పెట్టుకుని తెలంగాణకి వచ్చారని, రామగుండం వచ్చి సింగరేణిని అమ్మము అన్నారు.. నెలరోజుల్లో సింగరేణి కి చెందిన నాలుగు గనులను వేలం పెట్టారని మండిపడ్డారు. సింగరేణి కి ఆ బ్లాక్ లు ఇవ్వాలని కోరినం.. వేలంలో పాల్గొనమన్నారు తప్ప ఇవ్వలేదు… గుజరాత్ కు ఒక న్యాయం తెలంగాణా కి ఒక న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మాలంటే ముందుగా వాటిని నష్టాల్లోకి తోసి తరవాత మోడీ దోస్తులకు కట్టబెడతారు ఇదీ మోడీ నీతి అని ఆయన విమర్శించారు.
తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల, ఆర్టీసీ కార్మికుల పాత్ర విడదీయలేందని, సింగరేణికి కేసీఆర్ సర్కారు ఏన్నో చేసింది.. లాభాల్లో 32 శాతం ఇచ్చాము.. దీపావళి బోనస్ కూడా కలిపి 1000కోట్లు కార్మికులకు ఇచ్చామన్నారు కేటీఆర్. డిపెండెంట్ ఉద్యోగ సమస్య పరిష్కరించాం.డిస్మిస్డ్ ఉద్యోగాలు తిరిగి ఇచ్చామని, సింగరేణి స్థలాల్లో ఇళ్లు కట్టుకున్నవారికి పట్టాలు ఇచ్చామన్నారు. జూనియర్ కాలేజీ లేని రామగుండానికి మెడికల్ కాలేజీ ఇచ్చింది కేసీఆర్ అని, కేసీఆర్ అంటే నమ్మకం… మోడీ అంటే అమ్మకం అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
ఆరు దశాబ్దాలపాటు ఆగం చేసిన పార్టీ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అంటోంది… వ్యారంటీ లేని పార్టీ ఇచ్చే గ్యారంటీలకు విలువ ఉందా అని, ఒక్క చాన్స్ అంటున్న కాంగ్రెస్ కి 11 సార్లు చాన్స్ ఇచ్చారన్నారు. కాంగ్రెస్ ముద నష్టపు ముసలి నక్క… వంగి వంగి వినయం ప్రదర్శిస్తుందని, పక్క రాష్ట్రాల్లో ఇవ్వనోళ్లు ఇక్కడ ఎలా ఇస్తారన్నారు. బసంత్ నగర్ ఎయిర్ పోర్ట్ ని తెరవాలని కోరితే మోడీ స్పందన లేదని, కాంగ్రెస్ కి అధికారం ఇస్తే ఆరు గ్యారంటీలు ఏమో కానీ మూడు మాత్రం పక్కా ముడుగంటలు కరెంట్, ఏడాదికో సీఎం, స్కామ్ లు మాత్రం పక్కా అని ఆయన అన్నారు.
- Tags
- bjp
- breaking news
- BRS
- cm kcr
- latest news
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?