Medigadda Project: కాళేశ్వరంపై జ్యూడిషియల్ విచారణ చేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేడిగడ్డలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, పొంగులేటి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, పొన్నం ప్రభాకర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మేడిగడ్డ నిర్మాణంపై అధికారులు రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను పరిశీలించారు. కాసేపట్లో మేడిగడ్డ బ్యారేజ్ కి మంత్రుల బృందం వెళ్లనుంది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళపై తాము చెప్తున్న విషయాలు నిజం అయ్యాయని తెలిపారు. లక్షల కోట్లు అప్పు.. పదుల కోట్లు బిల్లులు బకాయి అని ఆరోపించారు. మరి ప్రాజెక్టు కట్టిన ప్రయోజనం ఏంటి అని ప్రశ్నించారు. కాళేశ్వరంకు జాతీయ హోదా కోసం అప్పటి ప్రభుత్వం అప్లై చేసామన్నది.. ప్రొఫార్మ ప్రకారం కేంద్రం పంపలేదు అని చెప్పింది అని మంత్రి తెలిపారు. కాళేశ్వరం జాతీయ ప్రాజెక్టు తేవడంలో బీఆర్ఎస్, బీజేపీ ఫెయిల్ అని విమర్శించారు.
Read Also: Akhu Chingangbam Kidnap: మణిపూర్ గాయకుడు-గీత రచయిత అఖు చింగాంగ్బామ్ కిడ్నాప్
Also Read
- Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
- Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
- Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
- Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
కాళేశ్వరంపై జ్యూడిషియల్ విచారణ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాకుండా.. పాలమూరు, రంగారెడ్డికి జాతీయ హోదా సాధిస్తామన్నారు. బ్యారేజ్ కుంగింది.. తప్పు జరిగిందని ఆరోపించారు. బ్యారేజ్ స్టోరేజ్ కెపాసిటీ 16 టీఎంసీ ఎక్కడా ఉండదని మంత్రి తెలిపారు. డిజైన్, కాన్సెప్ట్ ఫెయిల్ అని మంత్రి పేర్కొన్నారు. ఎన్నికల ముందు అధికారులు ఇచ్చిన నివేదిక.. అప్పటి ప్రభుత్వానికి లబ్ది చేకూర్చే పనిలో ఇచ్చారని తెలిపారు. డ్యామ్ సేఫ్టీకి అప్పటి అధికారులు ఇచ్చిన నివేదిక కాదు.. ఇప్పుడు పూర్తి సమాచారం ఇస్తామని మంత్రి తెలిపారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. వృధాగా గోదావరిలోకి వదిలిన నీళ్లు ఎన్ని ప్రశ్నించారు. రెండు పంటలకు నీళ్లు ఇస్తున్నామా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం నుండి ఎకరాకు నీళ్లు ఇవ్వడానికి అయ్యే ఖర్చు 46 వేలు.. లిఫ్ట్ కి విద్యుత్ రాష్ట్రంలో వినియోగించే 90 శాతం వాడాల్సి ఉంటుందని తెలిపారు. మూడో టీఎంసీకి 26 వేల కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్, భూకంపం ప్రమాదం పై అంచనా వేశారా లేదా..? అని ప్రశ్నించారు. బాహుబలి పంపులపై క్లారిటీ ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులను కోరారు.
తాజావార్తలు
-
Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
-
Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
-
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?