Medigadda Project: కాళేశ్వరంపై జ్యూడిషియల్ విచారణ చేస్తాం..
మేడిగడ్డలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, పొంగులేటి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, పొన్నం ప్రభాకర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మేడిగడ్డ నిర్మాణంపై అధికారులు రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను పరిశీలించారు. కాసేపట్లో మేడిగడ్డ బ్యారేజ్ కి మంత్రుల బృందం వెళ్లనుంది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళపై తాము చెప్తున్న విషయాలు నిజం అయ్యాయని తెలిపారు. లక్షల కోట్లు అప్పు.. పదుల కోట్లు బిల్లులు బకాయి అని ఆరోపించారు. మరి ప్రాజెక్టు కట్టిన ప్రయోజనం ఏంటి అని ప్రశ్నించారు. కాళేశ్వరంకు జాతీయ హోదా కోసం అప్పటి ప్రభుత్వం అప్లై చేసామన్నది.. ప్రొఫార్మ ప్రకారం కేంద్రం పంపలేదు అని చెప్పింది అని మంత్రి తెలిపారు. కాళేశ్వరం జాతీయ ప్రాజెక్టు తేవడంలో బీఆర్ఎస్, బీజేపీ ఫెయిల్ అని విమర్శించారు.
Read Also: Akhu Chingangbam Kidnap: మణిపూర్ గాయకుడు-గీత రచయిత అఖు చింగాంగ్బామ్ కిడ్నాప్
Also Read
- Hyderabad: ఏటీఎంలో ఊపిరాడక మృతి.. ఉదయం 5:30కు లోపలికి.. గంట తర్వాత విగతజీవిగా!
- Toxic: ‘టాక్సిక్’ లో రోమాంటిక్ సీన్స్ పై యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Karoline Leavitt: వైట్హౌస్కు దూరం కాబోతున్న ట్రంప్ ప్రతినిధి కరోలిన్ లీవిట్.. కారణమిదే!
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
కాళేశ్వరంపై జ్యూడిషియల్ విచారణ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాకుండా.. పాలమూరు, రంగారెడ్డికి జాతీయ హోదా సాధిస్తామన్నారు. బ్యారేజ్ కుంగింది.. తప్పు జరిగిందని ఆరోపించారు. బ్యారేజ్ స్టోరేజ్ కెపాసిటీ 16 టీఎంసీ ఎక్కడా ఉండదని మంత్రి తెలిపారు. డిజైన్, కాన్సెప్ట్ ఫెయిల్ అని మంత్రి పేర్కొన్నారు. ఎన్నికల ముందు అధికారులు ఇచ్చిన నివేదిక.. అప్పటి ప్రభుత్వానికి లబ్ది చేకూర్చే పనిలో ఇచ్చారని తెలిపారు. డ్యామ్ సేఫ్టీకి అప్పటి అధికారులు ఇచ్చిన నివేదిక కాదు.. ఇప్పుడు పూర్తి సమాచారం ఇస్తామని మంత్రి తెలిపారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. వృధాగా గోదావరిలోకి వదిలిన నీళ్లు ఎన్ని ప్రశ్నించారు. రెండు పంటలకు నీళ్లు ఇస్తున్నామా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం నుండి ఎకరాకు నీళ్లు ఇవ్వడానికి అయ్యే ఖర్చు 46 వేలు.. లిఫ్ట్ కి విద్యుత్ రాష్ట్రంలో వినియోగించే 90 శాతం వాడాల్సి ఉంటుందని తెలిపారు. మూడో టీఎంసీకి 26 వేల కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్, భూకంపం ప్రమాదం పై అంచనా వేశారా లేదా..? అని ప్రశ్నించారు. బాహుబలి పంపులపై క్లారిటీ ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులను కోరారు.
తాజావార్తలు
-
Hyderabad: ఏటీఎంలో ఊపిరాడక మృతి.. ఉదయం 5:30కు లోపలికి.. గంట తర్వాత విగతజీవిగా!
-
Toxic: ‘టాక్సిక్’ లో రోమాంటిక్ సీన్స్ పై యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Karoline Leavitt: వైట్హౌస్కు దూరం కాబోతున్న ట్రంప్ ప్రతినిధి కరోలిన్ లీవిట్.. కారణమిదే!
-
Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
-
Cheapest Saree Markets: మగువలకు గుడ్ న్యూస్.. రూ.150 కే పట్టు చీరలు.. దేశంలోనే అత్యంత చౌకైన మార్కెట్లు ఇవే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!