Chitradurga shocker: ఓ ఇంట్లో ఐదు అస్థిపంజరాలు.. అసలేం జరిగిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chitradurga shocker: కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి అస్థిపంజరాల అవశేషాలు లభ్యమయ్యాయి. చిత్రదుర్గ నగరంలోని పాత బెంగళూరు రోడ్డులోని ఓ పాడుబడిన ఇంట్లో గురువారం ఐదుగురు వ్యక్తుల అస్థిపంజరాలు లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. గురువారం రాత్రి పరిస్థితిని గమనించిన పోలీసులు అప్రమత్తమై ఆ తర్వాత పరిసరాల్లో సోదాలు చేపట్టారు. ఫోరెన్సిక్ నిపుణులు రాత్రి తర్వాత అక్కడికి చేరుకుని అవశేషాల నుంచి నమూనాలను సేకరించారు. ఆ కుటుంబం పూర్తిగా ఏకాంత జీవితం గడిపిందని, ఆ ఐదుగుపు పూర్తిగా 2019లో జులైలో చివరిసారిగా కనిపించారని, అనంతరం వారి నివాసానికి తాళం వేసి ఉందని తెలిసింది. ఇప్పుడు ఇలా అస్థిపంజరాలు దొరకడం స్థానికంగా కలకలం రేపుతోంది.
Read Also: Canada : కెనడాలోని హిందూ దేవాలయాలపై దాడి.. హుండీల దొంగ దొరికేశాడు
Also Read
- Medak: ఉమ్మడి మెదక్లో గాలివాన బీభత్సం.. తడిసి ముద్దయిన వరి ధాన్యం, ఆందోళనలో రైతన్నలు
- Super Mileage Car: సంచలనం సృష్టించిన విద్యార్థులు.. లీటర్ పెట్రోల్తో 911 కి.మీ. నడిచే కారు ఆవిష్కరణ.!
- Modi-Meloni: ఇటలీలో ప్రధాని మోడీ.. నేటి చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. మెలోని ఫొటోలు షేర్ చేసిన పీఎం..
- Japan Earthquake: భారీ భూకంపం.. వణికిపోయిన భవనాలు.!
బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ స్థలం రిటైర్డ్ ఇంజనీర్ జగన్నాథరెడ్డికి చెందినదని, కొన్నాళ్లుగా అతని కుటుంబం కనిపించడం లేదని తెలిపారు. దాదాపు నాలుగైదు సంవత్సరాలుగా ఇల్లు మూసి ఉంచబడింది. 2019లో ఆ నివాసం నుంచి దుర్వాసన వచ్చింది. చనిపోయిన ఎలుక చనిపోయిందనుకుని స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయలేదు. సుమారు రెండు నెలల క్రితం, ఉదయం అక్కడ నుంచి వెళ్తున్న సమయంలో స్థానికులు ఆ ఇంటి తలుపు పగలగొట్టి ఉండడాన్ని గమనించారు, అయినప్పటికీ పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఆ ఇంటి వెనుక ద్వారం కూడా పగలగొట్టబడింది. ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు తనిఖీలు చేపట్టడంతో మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ విషయంపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఈ ఇంట్లో జగన్నాథరెడ్డి (సుమారు 80 సంవత్సరాలు), అతని భార్య ప్రేమ (70 సంవత్సరాలు), వారి కుమార్తె త్రివేణి, కుమారులు కృష్ణారెడ్డి, నరేంద్ర రెడ్డిలు నివాసముంటున్నారు. జగన్నాథరెడ్డి పెద్ద కుమారుడు మంజునాథ్ రెడ్డి కొన్నేళ్ల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన వెలుగులోకి రావడంతో జగన్నాథ్ రెడ్డి బంధువు పవన్ కుమార్ మరణాలపై అనుమానాలు వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసుకు సంబంధించి తదుపరి విచారణలు జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Medak: ఉమ్మడి మెదక్లో గాలివాన బీభత్సం.. తడిసి ముద్దయిన వరి ధాన్యం, ఆందోళనలో రైతన్నలు
-
Super Mileage Car: సంచలనం సృష్టించిన విద్యార్థులు.. లీటర్ పెట్రోల్తో 911 కి.మీ. నడిచే కారు ఆవిష్కరణ.!
-
Modi-Meloni: ఇటలీలో ప్రధాని మోడీ.. నేటి చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. మెలోని ఫొటోలు షేర్ చేసిన పీఎం..
-
Japan Earthquake: భారీ భూకంపం.. వణికిపోయిన భవనాలు.!
-
Hyderabad: అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్.. 3 గంటల పాటు పోలీసుల హైడ్రామా!
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?