Chitradurga shocker: ఓ ఇంట్లో ఐదు అస్థిపంజరాలు.. అసలేం జరిగిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chitradurga shocker: కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి అస్థిపంజరాల అవశేషాలు లభ్యమయ్యాయి. చిత్రదుర్గ నగరంలోని పాత బెంగళూరు రోడ్డులోని ఓ పాడుబడిన ఇంట్లో గురువారం ఐదుగురు వ్యక్తుల అస్థిపంజరాలు లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. గురువారం రాత్రి పరిస్థితిని గమనించిన పోలీసులు అప్రమత్తమై ఆ తర్వాత పరిసరాల్లో సోదాలు చేపట్టారు. ఫోరెన్సిక్ నిపుణులు రాత్రి తర్వాత అక్కడికి చేరుకుని అవశేషాల నుంచి నమూనాలను సేకరించారు. ఆ కుటుంబం పూర్తిగా ఏకాంత జీవితం గడిపిందని, ఆ ఐదుగుపు పూర్తిగా 2019లో జులైలో చివరిసారిగా కనిపించారని, అనంతరం వారి నివాసానికి తాళం వేసి ఉందని తెలిసింది. ఇప్పుడు ఇలా అస్థిపంజరాలు దొరకడం స్థానికంగా కలకలం రేపుతోంది.
Read Also: Canada : కెనడాలోని హిందూ దేవాలయాలపై దాడి.. హుండీల దొంగ దొరికేశాడు
Also Read
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
- Mohammad Kaif: ‘రిటైర్మెంట్ ముచ్చట ముగిసింది.. విమర్శకుల ముక్కు కట్ అయింది’: మహ్మద్ కైఫ్
బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ స్థలం రిటైర్డ్ ఇంజనీర్ జగన్నాథరెడ్డికి చెందినదని, కొన్నాళ్లుగా అతని కుటుంబం కనిపించడం లేదని తెలిపారు. దాదాపు నాలుగైదు సంవత్సరాలుగా ఇల్లు మూసి ఉంచబడింది. 2019లో ఆ నివాసం నుంచి దుర్వాసన వచ్చింది. చనిపోయిన ఎలుక చనిపోయిందనుకుని స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయలేదు. సుమారు రెండు నెలల క్రితం, ఉదయం అక్కడ నుంచి వెళ్తున్న సమయంలో స్థానికులు ఆ ఇంటి తలుపు పగలగొట్టి ఉండడాన్ని గమనించారు, అయినప్పటికీ పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఆ ఇంటి వెనుక ద్వారం కూడా పగలగొట్టబడింది. ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు తనిఖీలు చేపట్టడంతో మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ విషయంపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఈ ఇంట్లో జగన్నాథరెడ్డి (సుమారు 80 సంవత్సరాలు), అతని భార్య ప్రేమ (70 సంవత్సరాలు), వారి కుమార్తె త్రివేణి, కుమారులు కృష్ణారెడ్డి, నరేంద్ర రెడ్డిలు నివాసముంటున్నారు. జగన్నాథరెడ్డి పెద్ద కుమారుడు మంజునాథ్ రెడ్డి కొన్నేళ్ల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన వెలుగులోకి రావడంతో జగన్నాథ్ రెడ్డి బంధువు పవన్ కుమార్ మరణాలపై అనుమానాలు వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసుకు సంబంధించి తదుపరి విచారణలు జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!