Talasani Srinivas: ఫిష్ ఫెస్టివల్ ఏర్పాట్లపై మంత్రి తలసాని మీటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు రేపటి (జూన్ 2న) నుంచి ఈ నెల 22 వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
Also Read : YV Subbareddy: జూన్ నెలాఖరుకి శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు పూర్తవుతాయి
Also Read
- Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
- Jasprit Bumrah: 2027 ప్రపంచకప్పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
- RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
- Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
సచివాలయంలో ఇవాళ ( గురువారం ) దశాబ్ది ఉత్సవాల నిర్వహణ, 8, 9, 10 తేదీల్లో నిర్వహించనున్న ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్బంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమలు చేస్తున్న కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమాలు, లబ్ధిదారులకు జరిగిన మేలుపై పాంప్లెట్స్ ద్వారా వివరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
Also Read : Pakistan: చంద్రుడిని చూసినమని అబద్ధం చెప్తే పాకిస్తాన్ లో 10 లక్షల జరిమానా
రాష్ట్రంలో గొర్రెలపై సబ్సిడీ, వాహనాలపై సబ్సిడీ, ఉచిత చేప పిల్లల లబ్ధిదారులు చాలామంది ఉన్నారు.. వారిని పశుసంవర్ధక, మత్స్య శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని చెప్పారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 3న తెలంగాణ రైతు దినోత్సవం సందర్భంగా గ్రామాల్లోని రైతు వేదికల వద్ద నిర్వహించే కార్యక్రమాల్లో పాడి రైతులు, మత్స్యకారులు పాల్గొనే విధంగా చూడాలన్నారు. 8న చెరువుల పండుగ సందర్భంగా చెరువులు, రిజర్వాయర్ల వద్ద వేదికలను ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి తలసాని అధికారులకు తెలిపారు.
తాజావార్తలు
-
Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
-
Jasprit Bumrah: 2027 ప్రపంచకప్పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
-
RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
-
Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
-
AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!