Sridhar Babu: రుణమాఫీతో ప్రతిపక్ష నాయకుల నోళ్ళు మూతపడ్డాయి..
- కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తాం.. చేసి చూపెడతాం- మంత్రి శ్రీధర్ బాబు
- రుణమాఫీతో ప్రతిపక్ష నాయకుల నోళ్ళు మూతపడ్డాయి- శ్రీధర్ బాబు
- 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేసే బాధ్యత మాది- మంత్రి
- 7 నెలల నుంచి ప్రతిపక్షాలు ప్రతి పనికి అడ్డుపడుతున్నాయి- శ్రీధర్ బాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తాం… చేసి చూపెడతామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రుల బృందం పర్యటిస్తోంది. అందులో భాగంగా.. శ్రీధర్ బాబు మాట్లాడుతూ, రుణమాఫీతో ప్రతిపక్ష నాయకుల నోళ్ళు మూతపడ్డాయని పేర్కొన్నారు. 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేసే బాధ్యత తమదని అన్నారు. 7 నెలల నుంచి ప్రతిపక్షాలు ప్రతి పనికి అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఫ్రీ బస్సు, ఆరోగ్య శ్రీని విజయవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రుణమాఫీపై కేటీఆర్, బండి సంజయ్ అబద్దాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక లక్ష కూడా మాఫీ చేయలేదని.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని పట్టించుకోలేదని మంత్రి మండిపడ్డారు.
Read Also: Stock market: మైక్రోసాఫ్ట్ విండోస్ ఎఫెక్ట్! భారీగా పతనమైన స్టాక్ మార్కెట్
Also Read
- Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
- రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
- Telangana Formation Day.. సీఎం రేవంత్, కేసీఆర్ శుభాకాంక్షలు.. రాష్ట్ర భవిష్యత్తుపై కీలక సందేశాలు.!
- Commercial Taxes Department: వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ.. కొత్త డివిజన్లు, సర్కిల్స్ ఏర్పాటు.!
ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయల అప్పులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.170 కోట్లతో నిర్మించే ఫామాయిల్ కంపెనీలో 250 మంది యువతకు ఉపాధి కల్పిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఫ్యాక్టరీలో ఎంప్లాయిమెంట్ కల్పిస్తూ నేరుగా 500 మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తామన్నారు. ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ పెట్టే యాజమాన్యానికి రైస్ బ్రాండ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మించాలని కోరామని తెలిపారు. 100 కోట్ల రూపాయలతో ప్రతిరోజు 350 టన్నుల ఉత్పత్తికి 120 మంది యువతకు ఉపాధి కల్పిస్తామని కంపెనీ యాజమాన్యం హామీ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. రైస్ బ్రాండ్ ఆయిల్ నిర్మాణానికి ముందుకు వచ్చిన కంపెనీ యాజమాన్యానికి ప్రాంత రైతుల పక్షాన మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటుకు సర్వే కొనసాగుతుందని ఆయన తెలియజేశారు.
Read Also: Parliament Session: బడ్జెట్ సమావేశాల్లో 6 కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం.. వివరాలు..
తాజావార్తలు
-
Peddi Breakeven Target : రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
-
Job News: ఏడాదికి రూ.55 లక్షల భారీ ప్యాకేజీ.. నోటిఫికేషన్ ఔట్.. ఇలా అప్లై చేసుకోండి!
-
Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!