NTV Telugu Site icon

Minister Seethakka : హత్యాచార బాధిత బాలిక కుటుంబానికి రూ.50 వేలు అందించిన మంత్రి సీతక్క

Seethakka

Seethakka

మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ బాలిక ఇటీవల మియాపూర్ లో హత్యాచారానికి గురికావడం తెలిసిందే. లక్ష్మ తండాకు చెందిన నరేశ్, శారద దంపతులు మూడు వారాల కిందట కూలి పనుల కోసం హైదరాబాద్ లోని మియాపూర్ వచ్చారు. వారి కుమార్తె (12) ఇంటి నుంచి కిరాణా దుకాణానికి వెళ్లి తిరిగి రాలేదు. అయితే అదే వీధిలో ఓ చెత్త కుప్పలో ఆ బాలిక విగత జీవురాలిగా కనిపించింది. బాలికను అత్యాచారం చేసి చంపి ఉంటారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, మంత్రి సీతక్క మహబూబాబాద్ జిల్లాలో నేడు అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు.

 

బాలిక తల్లిదండ్రులకు రూ.50 వేల సాయం అందించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్‌తో కలిసి కుటుంబ సభ్యులను ఓదార్చి సానుభూతి తెలిపారు.  బాలిక కేసులో పోలీసులు జాప్యం చేస్తున్నారంటూ కుటుంబ సభ్యులు ఆమె దృష్టికి తీసుకెళ్లగా, ఆమె మియాపూర్ పోలీసులతో మాట్లాడారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ.50వేల ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.