Minister Seethakka: అవయవాలు లేవని ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seethakka: కళ్ళు లేని వారికి ప్రపంచాన్ని చూపించిన లూయిస్ బ్రెయిలి గొప్ప వ్యక్తి అని.. అవయవాలు లేవని ఆత్మవిశ్వాసం కోల్పోకూడదని పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మలక్ పేట్ దివ్యాంగులు భవన్ లో ఘనంగా లూయిస్ బ్రెయిలి 215 జన్మదిన వేడుకలకు సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంధర్భంగా అంథుల కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ తో రూపొందించిన ల్యాప్ టాప్ లు, ఫోన్ లను అంథులకు అందించారు. అనంతరం మాట్లాడుతూ.. కళ్ళు లేని వారికి ప్రపంచాన్ని చూపించిన లూయిస్ బ్రెయిలి గొప్ప వ్యక్తి అని అన్నారు. లూయిస్ బ్రెయిలి జీవితంను అందరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. లిపి కనుక్కోని కళ్ళు లేని వారికి బ్రెయిలి కనుచూపు అయ్యారని తెలిపారు. అవయవాలు లేవని ఆత్మవిశ్వాసం కోల్పోకూడదన్నారు. చిన్న తనంలో కళ్ళు పోగోట్టుకుని సంఘర్షణ ద్వారా బ్రెయిలి లిపి కనుగొన్నారని అన్నారు. అన్ని రకాల సమస్యలు పరిష్కారిస్తామన్నారు. అంథులు సరైన బస్ స్టాప్ లలో దిగేవిధంగా సౌండ్ సిస్టం ఏర్పాటు చేసేవిధంగా రవాణాశాఖ మంత్రితో మాట్లాడుతా అని తెలిపారు. అంథుల రిజర్వేషన్ పై ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. పెండింగ్ లో ఉన్న బ్యాక్ లాగ్ పోస్ట్ లను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.
Read also: Hyundai Creta facelift: క్రెటా ఫేస్లిఫ్ట్ వచ్చేస్తోంది.. లాంచ్, ధర, ఫీచర్ల వివరాలు ఇవే….
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
మహిళలు, అనాథలకు మంత్రి సీతక్క శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే.. ఆ శాఖపై ఆమె సమీక్ష నిర్వహించి వారికి శుభవార్త అందించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అనాథ పిల్లలకు రెండు శాతం కోటా కేటాయించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. అనాథలను దత్తత తీసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారని.. నిబంధనలు కఠినంగా ఉన్నందున ఎక్కువ మంది ముందుకు రావడం లేదని సీతక్క తెలిపింది. ఈ నేపథ్యంలో దత్తత నిబంధనలను సరళతరం చేయాలని అధికారులకు ఆమె సూచించారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగాల కోసం వచ్చే మహిళల కోసం ముఖ్యమైన పెద్ద నగరాల్లో మహిళా సంక్షేమ శాఖ తరఫున హాస్టళ్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. దీంతో పాటు ప్రతి జిల్లాలో వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయాలని సీతక్క అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల దగ్గరే అంగన్వాడీ కేంద్రాలు ఉండేలా అధికారులు చొరవ చూపాలి. అంగన్వాడీ కేంద్రాల పటిష్టతకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్ వాడీల్లో ప్రీ స్కూల్స్ ఏర్పాటుపై అధికారులు ఆలోచించాలన్నారు.
Karsevak Arrest: కరసేవకుల అరెస్ట్ పై బీజేపీ నేతల ఆందోళన
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?