Minister Satya Prasad: భూ సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం దృష్టి..

  • భూ సమస్యల పరిష్కారంపై దృష్టి
  • గత ప్రభుత్వ విధానాలపై మంత్రి విమర్శ
  • సింహాచలం భూములపై అంశాన్ని పరిష్కరిస్తామని హామీ
Minister Satya Prasad

Minister Satya Prasad

భూ సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెడుతుందని మంత్రి అనగానే సత్యప్రసాద్ తెలిపారు. బుధవారం విశాఖపట్నం ముఖ్యనేతలతో రెవెన్యూ.. ఎండోమెంట్ సమావేశం జరిగింది.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “గత ప్రభుత్వంలో భూములను కొట్టేశారా అనే ఆలోచనలు ఉండేవి.. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత సమస్యల పరిష్కారం వైపు అడుగులు వేస్తున్నాం. సింహాచలం భూములపై గతంలో అనేక మంది హామీలు ఇచ్చారు. కానీ పూర్తి చేయలేకపోయారు.. ప్రస్తుతం పంచ గ్రామాల భూముల అంశంలో న్యాయపరమైన చిక్కులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అశోక్ గజపతి అనుమతితో భూముల పరిష్కారానికి నిర్ణయం తీసుకుంటున్నాం. 500 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని 12 వేల మందికి లబ్ధి చేకూరే విధంగా ముందుకు తీసుకువెళ్తున్నాం.” అని మంత్రి వ్యాఖ్యానించారు.

READ MORE: PMA Salam: పురుషులు-మహిళలు సమానం కాదు.. ముస్లిం లీగ్ నాయకుడి వివాదాస్పద ప్రకటన

గత ప్రభుత్వంలో ఎక్కడ వారి గురించి ఆలోచన చెయ్యలేదని మంత్రి సత్యప్రసాద్ విమర్శించారు. “చంద్రబాబుకి విశాఖపట్నం పై ఎలాంటి ప్రేమ ఉంది అనే దానికి నిదర్శనం.. గాజువాక భూముల అంశంలో ఎన్నికల ముందు గత ప్రభుత్వం జీవోని సవరించాం. గతంలో ఇచ్చిన జీవో కంటే కొంచెం ధర పెంచాం. భూ హక్కులు కల్పించే విధంగా ఈ రోజు నిర్ణయాలు జరిగాయి.. గత ప్రభుత్వం శుక్రవారం వస్తే బుల్డోజర్లు వస్తాయా? అనే భయం ఉండేది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో భూ హక్కుల సమస్యలపై పరిష్కారానికి అడుగులు వేస్తాం. సింహాచలం భూముల విషయంలో మరికొన్ని ఇబ్బందులు ఉన్నాయి.. వాటిని తీరుస్తాం. చిత్తూరు జిల్లాలో పెద్ద రెడ్డి భూముల అంశంలో విజిలెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది.. ఎంత పెద్ద వారు ఉన్న భూముల విషయంలో వదిలే ప్రసక్తి లేదు..” అని మంత్రి హెచ్చరించారు.

READ MORE: CBSE Recruitment 2025: ఇంటర్, డిగ్రీ పాసయ్యారా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మీకోసమే