Minister RK Roja: చంద్రబాబు, లోకేష్పై మంత్రి రోజా హాట్ కామెంట్లు.. భువనేశ్వరి, బ్రహ్మణిపై గౌరవం పోతుంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister RK Roja: చంద్రబాబు, లోకేష్తో పాటు భువనేశ్వరి, బ్రహ్మణిపై కూడా సంచలన వ్యాఖ్యలుచేశారు మంత్రి ఆర్కే రోజా.. విజయవాడలోని తుమ్మలపల్లిలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లోకేష్ రాష్ట్రపతిని కలిసి తప్పు చేసిన తన తండ్రిని కాపాడాలని కోరారు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం లోకేష్ రాష్ట్రపతిని కలిసిన దాఖలాలు లేవు అంటూ ఎద్దేవా చేశారు. లోకేష్ ఢిల్లీలో మోడీ, అమిత్ షా కాళ్లు పట్టుకోవడానికి తిరుగుతున్నారు.. కానీ, అడ్డంగా దొరికిన చంద్రబాబును కాపాడేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్నారు.. ప్రధాని మోడీ , అమిత్ షా కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు స్కిల్ డెవెలప్మెంట్ సహా అమరావతి, ఫైబర్ నెట్ వంటి అనేక స్కాంలు చేశారని ఆరోపించారు మంత్రి రోజా.. రోడ్డు వేయకముందే ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్మెంట్ పేరుతో దోచుకున్నారు.. ఆరు నెలల్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని లోకేష్ చెప్తుంటే అందరూ నవ్వుతున్నారు.. స్కాంలలో ఇరుక్కుని లోకేష్ ఢిల్లీ పారిపోయాడు అని విమర్శించారు. కాళ్ల నుండి కళ్ల వరకూ భయంతో లోకేష్ వణికిపోతున్నాడు.. ఎర్రబుక్ లో రసుకుంటానని బెదిరిస్తున్న లోకేష్.. సీఐడీ మెమోలో ఆయన పేరు రాశారని గుర్తు చేసుకోవాలన్నారు. హెరిటేజ్ లో 2 శాతం షేర్లు అమ్మితేనే 400 కోట్లు వస్తాయని భువనేశ్వరి చెప్తున్నారు.. అంటే చంద్రబాబు ఆస్తి 20 వేల కోట్లా? అని ప్రశ్నించారు.
Also Read
- 5 Best Salads for Glowing Skin: సింపుల్గా తయారుచేసే ఈ 5 సలాడ్లు వాడండి.. మీ చర్మం గులాబీ రంగులో మెరిసిపోతుంది..!
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మే బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- Messi-Ronaldo: మెస్సీ vs రొనాల్డో.. ఆఖరి వరల్డ్ కప్లో చరిత్ర సృష్టించనున్న ఫుట్బాల్ దిగ్గజాలు
- Rishabh Pant: ‘మా గెలుపుకు కారణం.. నేను బ్యాటింగ్కు రాకపోవడానికి రీజన్ ఇదే’: రిషబ్ పంత్
కర్జూర నాయుడు చంద్రబాబుకు, ఆయన తమ్ముడికి చెరో ఎకరం ఇచ్చారు.. అక్కడి నుండి లక్షల కోట్లకు చంద్రబాబు ఆస్తి ఎలా పెరిగింది? అని నిలదీశారు మంత్రి రోజా.. హైదరాబాద్ లో చంద్రబాబు ఇల్లు రూ.600 కోట్లుగా పేర్కొన్న ఆమె.. భువనేశ్వరి, లోకేష్ 118 కోట్ల రూపాయల నోటీసులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రపంచ దేశాల్లోని తెలుగువారంతా ఈ స్కాంలను తెల్సుకోవాలని సూచించారు. ఇక, భువనేశ్వరి, బ్రహ్మణి అబద్ధాలు చెప్తుంటే ఎన్టీఆర్ కూతురు, మనవరాలు అనే గౌరవం కూడా పోతుందన్నారు. చంద్రబాబు టీమ్ వర్క్ గా కుటుంబసభ్యులంతా దోపిడీలో భాగస్వామ్యం అయినట్టు ప్రజలకు స్పష్టమైందని హాట్ కామెంట్లు చేశారు మంత్రి ఆర్కే రోజా.
తాజావార్తలు
-
5 Best Salads for Glowing Skin: సింపుల్గా తయారుచేసే ఈ 5 సలాడ్లు వాడండి.. మీ చర్మం గులాబీ రంగులో మెరిసిపోతుంది..!
-
Gig Workers Strike: “పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి”.. మళ్లీ సమ్మే బాట పట్టిన గిగ్ వర్కర్లు..
-
Messi-Ronaldo: మెస్సీ vs రొనాల్డో.. ఆఖరి వరల్డ్ కప్లో చరిత్ర సృష్టించనున్న ఫుట్బాల్ దిగ్గజాలు
-
Manchu Manoj: మంచు మనోజ్ టీమ్లో మిస్టరీ డెత్.. ‘డేవిడ్ రెడ్డి’ సెట్స్లో అసలేం జరిగింది?
-
Buchi Babu Sana: జాన్వీకి ‘పెద్ది’ ఛాన్స్ వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..