Peddireddy Ramachandra Reddy : రాష్ట్రంలో విద్యుత్ శాఖ ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతిలో ఎలక్ట్రికల్ సేఫ్టీ వర్క్ షాప్ ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. విద్యుత్ ప్రమాదాల నివారణపై వర్క్ షాప్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో.. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్ శాఖ ఒక ప్రధాన పాత్ర పోషిస్తుందని, ఆర్ధిక అభివృద్ధికి విద్యుత్ శాఖ చాలా ముఖ్యం అని ఇటీవల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో మరో సారి రుజువైందన్నారు. అనేక రకాల సమస్యలను అధిగమించేందుకు అందరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఎలక్ట్రికల్ సేఫ్టీ చాలా ముఖ్యమని, చిన్న అలసత్వం కూడా అత్యంత ప్రమాదకరమన్నారు. అటవీ జంతువులు కట్టడికి కూడా విద్యుత్ వైర్లు లాగుతున్న పరిస్థితి ఉందని, వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తె అందులో 9 లక్షల కోట్లు విద్యుత్ శాఖకు వచ్చాయన్నారు. చంద్రబాబు నాయుడు భారీగా ప్రచారం చేసుకున్నా కూడా అయన పెట్టిన సమ్మిట్ కు సంబందించి ఎక్కడా ఒక పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదని ఆయన వెల్లడించారు.
Also Read : Samyuktha Menon: అప్పుడే ఈ మలయాళ బ్యూటీ టాలెంట్ చూపిస్తుందే
Also Read
- రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
- 20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
ఈరోజు సీఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన సమ్మిట్ కు పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారని ఆయన తెలిపారు. అంతేకాకుండా.. ‘ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇప్పటికే సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేశాం. సబ్ స్టేషన్ లెవల్ లో కూడా కమిటీ వేస్తే, వారి సమన్వయంతో మరింత ముందుకు సాగుదాం. అనంతపురం లో వరుసగా విద్యుత్ ప్రమాదాలు జరిగాయి. వెంటనే అధికారులను అప్రమత్తం చేసి చర్యలు చేపట్టాం. ఒకేసారి 15 వేల మంది ఎనర్జీ అసిస్టెంట్స్ ను ఇప్పటికే నియమించాం. వారి సేవలు కూడా ఉపయోగించుకోవాలి, ఒక పటిష్టమైన కమ్యునికేషన్ వ్యవస్థ సిద్దం చేయాలి. ముందుకు వచ్చిన పెట్టుబడిదారులకు సహకరించి వారికి ప్రక్రియ సులభంగా మారేందుకు చర్యలు తీసుకోవాలి. సేఫ్టీ విషయంలో ఎటువంటి రాజిపడటానికి వీల్లేదు. ఈ వర్స్ షాప్ ద్వారా అందరికీ పూర్తి స్థాయి అవగాహన వస్తుందని ఆశిస్తున్నా.’ అని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read : Bomb Threat: ఢిల్లీ స్కూల్ కి బాంబు బెదిరింపు.. విద్యార్థుల్లో భయాందోళన
తాజావార్తలు
-
Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్… గూస్బంప్స్ గ్యారెంటీ!
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
ట్రెండింగ్
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!