Amaravati: ఆపరేషన్ బుడమేరుకు రంగం సిద్ధం.. ఆక్రమణలను గుర్తించే పనిలో యంత్రాంగం
- ఆపరేషన్ బుడమేరుకు రంగం సిద్దం చేస్తోన్న ప్రభుత్వం
- బుడమేరు ఆక్రమణలను గుర్తించే పనిలో ఇరిగేషన్ యంత్రాంగం
- మంత్రి నిమ్మల సమీక్షలో బుడమేరు ఆక్రమణల గుర్తింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ క్యాంప్ ఆఫీస్లో ఆపరేషన్ బుడమేరుపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి జలవనరుల శాఖ ఈఎన్సీ, ఎస్.ఇ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, రెవెన్యూ, సర్వే అధికారులు హాజరయ్యారు. సమీక్ష అనంతరం మంత్రి రామానాయుడు మాట్లాడుతూ.. బెజవాడ దుఃఖ దాయనిగా పిలవబడుతున్న బుడమేరుకు శాశ్వత పరిష్కారానికి ప్రణాళికపై సమీక్ష నిర్వహించామని తెలిపారు. భవిష్యత్తులో బెజవాడ ముంపు రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు ఆలోచన లక్ష్యంగా ప్రతిరోజు రివ్యూ సమీక్షలు చేస్తున్నామని పేర్కొన్నారు. బుడమేరు ఆక్రమణలకు సంబంధించి విద్యాధరపురం నుంచి గుణదల వరకు వీఎంసీ పరిధిలో ఎక్కువ ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించామని మంత్రి రామానాయుడు చెప్పారు.
Read Also: CM Relief Fund: సీఎం రిలీఫ్ ఫండ్కు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం..
Also Read
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
- Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్తో 'జై షా' కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
ఈ లిమిట్లో 202 ఎకరాలకు గాను 70 ఎకరాలు ఆక్రమణ పాలయింది.. ఆక్రమణ స్థలంలో 3051 ఇళ్ల నిర్మాణాలు జరిగాయని గుర్తించామని మంత్రి పేర్కొన్నారు. బుడమేరు విస్తీర్ణం ఎంతవరకు ఉంది.. ఎంతవరకు ఆక్రమణ జరిగిందో వాస్తవ నివేదికను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్తున్నామని మంత్రి నిమ్మల చెప్పారు. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎనికేపాడు వరకు పలు గ్రామాలు, నగరంలో పలు వార్డులు విస్తరించి ఉన్నాయన్నారు. చీమల వాగు, కేసరవల్లి, ఎనికెపాడు యూటీ నుంచి కొల్లేరు వరకు సామర్థ్యం గట్లు పటిష్ట, లైనింగ్ విస్తరణ చేసేందుకు సమీక్ష చేసామని అన్నారు. అలాగే.. బుడమేరు ఓల్డ్ ఛానల్ ఇళ్ల, పట్టణ మధ్య నుంచి ప్రవహించడం వల్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి పాములు కాల్వ, ముస్తాబాద్ కెనాల్, ఎనికేపాడు వరకు ఉన్న కాలువకు ప్రత్యామ్నాయంగా విస్తరణతో వరద నీరు మళ్లింపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో అభిప్రాయాలతో వాస్తవ పరిస్థితిపై సమీక్ష చేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
Read Also: Bihar: బీహార్లో ఐపీఎస్ల రాజీనామా .. ప్రశాంత్ కిషోర్ హస్తం ఉందా?
తాజావార్తలు
-
BharatPe Flex Feature: భారత్పే కొత్త ఫ్లెక్స్ ఫీచర్.. UPI ద్వారా నేరుగా రుణాలు.. 45 రోజుల వడ్డీ రహిత క్రెడిట్
-
Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
-
Korean Kanakaraju : ‘కొరియన్ కనకరాజు’ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్… మరో సర్ప్రైజ్ కూడా
-
Realme X3 SuperZoom: 64MP క్వాడ్ కెమెరాలతో.. రియల్మీ ఎక్స్3 సూపర్ జూమ్.. రూ.14 వేల కన్నా తక్కువ ధరకే
-
Astrology: ఈ 4 రాశులవారు కోపం వచ్చినప్పుడు అసలు కంట్రోల్లో ఉండరట.. మీ రాశి కూడా ఉందా?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!