Minister Narayana: 12 టవర్లలో 288 అపార్టుమెంట్లు.. అమరావతిలో నిర్మాణ పనులు వేగవంతం
Minister Narayana: అమరావతి రాజధాని అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ తాజా సమీక్ష నిర్వహించి కీలక ప్రకటనలు చేశారు. నగర నిర్మాణంలో భాగంగా ఇప్పటికే అనేక నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రుల నివాసాలతో పాటు అధికారుల నివాసాల నిర్మాణంపై స్పష్టత ఇచ్చారు. ఇందులో భాగంగా.. రాజధాని ప్రాజెక్టులో కీలకమైన ట్రంక్ రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం ముందడుగు వేసింది. మొత్తం 360 కిలోమీటర్ల రహదారులకు టెండర్లు పిలవడం జరిగిందని మంత్రి వెల్లడించారు.
Also Read
- Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
- PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
- NoiseFit Diva Araya: నాయిస్ ఫిట్ దివా అరయా.. మహిళలకు స్టైలిష్ స్మార్ట్వాచ్.. లైవ్ లొకేషన్ ట్రాకింగ్ కూడా
- Iran War: ఇరాన్ దెబ్బకు అమెరికాకు బిలియన్ డాలర్ల నష్టం..
అలాగే ఎమ్మెల్యేలు, మంత్రుల బంగళాలను పరిశీలించినట్లు నారాయణ తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 12 టవర్లు, మొత్తం 288 అపార్టుమెంట్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఆలిండియా సర్వీసు అధికారులకు 6 టవర్ల నిర్మాణం జరుగుతుండగా, గ్రౌండ్ ఫ్లోర్ దాదాపు పూర్తయిందన్నారు. ఇంకా నాన్ గెజిటెడ్ అధికారుల నివాసాల టవర్లు కూడా నిర్మాణాంతర దశలో ఉన్నాయని తెలిపారు. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టులో 6 టవర్లు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. ఇవన్నీ వచ్చే మార్చి 31 లోపు పూర్తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు.
అయితే, ఆలిండియా సర్వీసు అధికారుల కోసం నిర్మిస్తున్న టవర్లను ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరులోగా పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించామని మంత్రి వెల్లడించారు. అలాగే ఐకానిక్ టవర్ డిజైన్లు పూర్తయ్యాయి. నార్మన్ ఫోస్టర్ బృందం ఇవాళ అమరావతికి రానున్నదని, వారితో డిజైన్పై చర్చలు జరుగుతాయని తెలిపారు. 75 ప్రైవేట్ కంపెనీలకు భూకేటాయింపు పూర్తయిందని చెప్పారు. డిసెంబర్ ఎండింగ్ నాటికి కంపెనీలు నిర్మాణ పనులు ప్రారంభిస్తాయని తెలిపారు.
Arjun : 8 ఏళ్ల తర్వాత హీరోగా అర్జున్ సర్జా రీ ఎంట్రీ !
గత ప్రభుత్వ హయాంలో రైతులు, కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడ్డారని మంత్రి విమర్శించారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్పై ఎలాంటి అభ్యంతరాలు రావడం లేదని పేర్కొన్నారు. ఇక సబ్కమిటీ చర్చల అనంతరం క్యాబినెట్లో ల్యాండ్ పూలింగ్ అంశాన్ని తీసుకువస్తామని తెలిపారు. ముఖ్యంగా అమరావతిలో లీగల్ ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్ అన్నీ పరిష్కారమయ్యాయి అని మంత్రి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
-
PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
-
Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
-
Payal Rajput Lover హీరోగా సినిమా.. ఆరోజే రిలీజ్
-
NoiseFit Diva Araya: నాయిస్ ఫిట్ దివా అరయా.. మహిళలకు స్టైలిష్ స్మార్ట్వాచ్.. లైవ్ లొకేషన్ ట్రాకింగ్ కూడా
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!