Minister Narayana: అమరావతి మాస్టర్ ప్లాన్పై ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏర్పాటు చేసిన మాస్టర్ ప్లాన్తోనే ముందుకెళ్తామని ఆయన వెల్లడించారు. అమరావతి నిర్మాణంపై పూర్తిగా స్టడీ చేసి ముందుకెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారని.. ఆ దిశగా నివేదిక రెడీ చేసి ప్రజల అభిప్రాయంతో నిర్మాణం చేపడతామన్నారు. అమరావతి నిర్మాణం అంశంలో రిపోర్టు ఇవ్వడానికి అధికారులకు 15 రోజులు సమయం ఇచ్చామని మంత్రి తెలిపారు. గత కాంట్రాక్టర్లను ఉంచారా లేదా అనేది చూడాల్సి ఉందన్నారు. టెక్నికల్ అంశం కనుక పూర్తి పరిశీలన చేస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. అమరావతి నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో త్వరలో ప్రజలకు చెపుతామన్నారు. అమరావతికి జరిగిన డ్యామేజీకి బాధ్యులెవరో విచారణ కూడా జరపుతామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకం దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇటీవల సీఎం అమరావతి ప్రాంతంలో కూడా పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏపీ అంటే అమరావతి, పోలవరం అని కూడా పేర్కొన్నారు.