Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Minister Nara Lokesh To Lay Foundation Stone For Lg Electronics Plant In Sri City Today

Minister Nara Lokesh: తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేష్‌

Published Date :May 8, 2025 , 8:38 am
By Sudhakar Ravula
  • తిరుపతి జిల్లాలో మరొక కీలకమైన ప్రాజెక్టు..
  • శ్రీసిటీలో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ప్లాంట్‌ ఏర్పాటు..
  • నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి నారా లోకేష్..
  • 5వేల కోట్లతో పరిశ్రమ ఏర్పాటు.. 2 వేల మందికి ఉద్యోగావకాశాలు..
Minister Nara Lokesh: తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేష్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

Minister Nara Lokesh: తిరుపతి జిల్లాలో మరొక కీలకమైన ప్రాజెక్టు వచ్చి చేరింది.. ఈ రోజు శ్రీసిటీలో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు మంత్రి నారా లోకేష్… 5వేల కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు.. శ్రీసిటీలో ఎల్‌జీ గృహోపకరణాలు తయారీ యూనిట్ కు మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేయనున్నారు. ఈ పరిశ్రమతో  2 వేల మందికి ఉద్యోగావకాశాలతో పాటు.. 839 కోట్ల రూపాయలతో మరో 5 అనుబంధ యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నారు..

Read Also: AP Cabinet: భూ కేటాయింపులపై ఆమోదం తెలపనున్న కేబినెట్‌.. యుద్ధ వాతావరణంపై చర్చ!

ఈ రోజు తిరుపతి జిల్లాలో పర్యటించనున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. ఈ కీలక ప్రాజెక్టుకు భూమిపూజ చేయనున్నారు. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ పారిశ్రామిక దిగ్గజం ఎజీ సంస్థ ప్లాంట్ ఏర్పాటుకు తిరుపతి జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వాడ శ్రీసిటీ వేదిక కానున్నది. రూ.5 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఆ ప్లాంట్ కు పలురకాల రాయితీలను ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. తొలి దశలో 188 ఎకరాలను కేటాయించింది. 1500 మందికి ప్రత్యక్షంగా, మరో అయిదారు వేలమందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించనుంది.. దేశంలో ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో మూడో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆహ్వానించింది. నూతన పారిశ్రామిక విధానం 4.0 కింద ప్రకటించిన రాయితీలకు ప్రతిస్పందించిన ఎల్‌జీ యాజమాన్యం గత ఏడాది నవంబర్‌లో రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి లాంఛనంగా ఒప్పందం కుదుర్చుకుంది. తరువాత దశలో తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పరిధిలో దక్షిణ భారత దేశంలో అత్యుత్తమ బహుళ ఉత్పత్తుల వాణిజ్య నగరంగా పేరొందిన శ్రీ సిటీ పారిశ్రామిక వాడ ను ఎల్ జి సంస్థ ఎంపిక చేసుకుంది.

Read Also: Jammu Kashmir: ఉగ్రవాదులు, వారి అనుచరుల ఇళ్లల్లో తనిఖీలు.. కీలక వస్తువులు స్వాధీనం!

రూ 5,001 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయతలపెట్టిన ఎల్జీ ప్లాంట్ కోసం దాదాపు 250 ఎకరాల స్థలం కావాలని ఆ సంస్థ యాజమాన్యం కోరింది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వ సతుల కల్పనా సంస్థ (ఏపిఐఐసి) ద్వారా శ్రీ సిటీ 2వ విస్తరణ పరిధిలోని కొల్లడం గ్రామ సమీపంలో తొలిదశలో 188 ఎకరాల స్థలాన్ని కేటాయించినా మలిదశలో మరో 70 ఎకరాల దాకా కేటాయిస్తామని హామీ ఇచ్చింది. అంతేకాక 20 ఏళ్లపాటు వంద శాతం రాయితీతో నీటి సరఫరా చేయడానికి, పలు మినహాయింపులతో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించడానికి ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. మరో రెండేళ్లలో ఇక్కడ ఉత్పత్తి ప్రారంభం అవుతుంది.. ఈ రోజు ఉదయం కంపెనీ కి సంబందించిన భూమి పూజా, శంకుస్థాపన చేయానున్నారు లోకేష్‌‌. దానికి సంబంధించిన పనులు పూర్తిచేశారు జిల్లా అధికారులు… తిరుపతి జిల్లాకు కీలకమైన ప్రాజెక్టు వస్తున్న తరుణంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు జిల్లా వాసులు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • LG Electronics
  • LG Electronics plant
  • Minister Nara Lokesh
  • Sri City

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions