Minister Nara Lokesh: డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం.. వారే నాకు ఆదర్శమన్న లోకేష్
- ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం..
- విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీకి మంత్రి లోకేష్..
- డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభించిన లోకేష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh: ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం.. విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో “డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం” పథకాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. మొదట పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరిశీలించిన ఆయన.. తరగతి గదులు, కెమిస్ట్రీ ల్యాబ్ను సందర్శించారు. ఆ తర్వాత విద్యార్థినిలతో కాసేపు ముచ్చటించారు. ఇంటర్ సెకండియర్ విద్యార్థినిలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఇంటర్మీడియట్ ఎంతో కీలకమైన దశ అని అన్నారు. మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు ఇప్పటి నుంచే దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలన్నారు. డ్రగ్స్ వాతావరణం మీ పరిసరాల్లో ఎక్కడ కనిపించినా వెంటనే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయాలని కోరారు. ఇక, మధ్యాహ్న భోజన పథకంలో పెట్టే భోజనం తమకు పౌష్టిక విలువలు అందిస్తుందని, ఉన్నతమైన విద్య చదువుకోవడానికి ఆరోగ్యం బాగుంటుందని అంటున్నారు విద్యార్ధులు.. విద్యార్ధులతో కలిసి మంత్రి లోకేష్ భోజనం చేశారు… మధ్యాహ్న భోజనం అందించడంపై సంతోషం వ్యక్తం చేశారు విద్యార్థులు..
Read Also: Nagavamshi : “డాకు మహారాజ్” నిర్మాత నాగవంశీ స్పెషల్ రిక్వెస్ట్
Also Read
- Best Batting Pair: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కాదు.. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటింగ్ జోడి ఇదే..
- Tamil Nadu: ఇదేం పద్ధతి? బాలిక హత్య కేసు ప్రెస్మీట్లో పోలీసులు వెకిలి నవ్వులు.. వీడియో వైరల్
- CM Vijay: సింహాసనం విజయ్ది.. వ్యూహం కాంగ్రెస్ది.. నట్టేట మునిగిన ఏఐఏడీఎంకే రెబల్స్..!
- Pawan Kalyan: అమిత్ షాతో అలాంటి విషయాలు ఎందుకు మాట్లాడతాను
మరోవైపు, ఇక్కడనున్న జూనియర్ కళాశాల బయట సీసీ కెమెరాలు పెట్టిస్తాను అన్నారు మంత్రి లోకేష్.. ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల మధ్య ఉన్న తేడాలు లేకుండా చేస్తాం.. ప్రైవేటు విద్యలో వచ్చిన అభివృద్ధిని ప్రభుత్వ కాలేజీలు కూడా తీసుకొస్తాం అన్నారు.. కళాశాలలకు ప్రత్యేకంగా ఒకే విధంగా ఉండేలా రంగులు వేయాలని చూస్తున్నాం.. దేనికైనా ఫిట్నెస్ కంటే సంకల్పం కావాలి అన్నారు.. సింగపూర్ ప్రధానిగా పని చేసిన లీక్వానీ, భారత ప్రధానిగా పని చేసిన వాజ్ పేయి, మా నాన్న చంద్రబాబు.. నాకు ఆదర్శం అని ఈ సందర్భంగా వెల్లడించారు నారా లోకేష్..
తాజావార్తలు
-
Chairmans Desk : ప్రొడక్షన్ క్వాలిటీ పేరుతో జరుగుతున్నదేంటి..?
-
Story Board : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ క్రాష్? కొనుగోలుదారులకు షాక్, ఇన్వెస్టర్లలో వణుకు!
-
Pawan Kalyan : నాకు సూపర్ స్టార్ డమ్ ఉంది… ఇప్పటికీ ‘OG’ లాంటి సినిమాలు చేయగలను
-
Best Batting Pair: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కాదు.. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటింగ్ జోడి ఇదే..
-
Cabinet Sub Committee : రేపు కేబినెట్ సబ్ కమిటీ అత్యవసర భేటీ!
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?