NTV Telugu Site icon

Minister Nara Lokesh: ఏ ఘటననూ ఉపేక్షించేది లేదు.. ఏ నిందితుడినీ వదిలేది లేదు..

Nara Lokesh

Nara Lokesh

Minister Nara Lokesh: రాష్ట్రంలో ఏ ఘటననూ ఉపేక్షించేది లేదు.. ఏ నిందితుడినీ వదిలేది లేదని స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్‌.. రాష్ట్రంలో హిసం, విధ్వసం, అరాచకం, అన్యాయం జరుగుతుందంటూ వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేసిన ట్వీట్‌కు కౌంటర్‌ ఇచ్చిన ఆయన.. హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అక్రమం, అవినీతి గురించి వైఎస్ జగన్ మాట్లాడడం రోత పుట్టిస్తోందని దుయ్యబట్టారు.. బాధితులనే నిందితులు చేసి గవర్నమెంట్ టెర్రరిజానికి పాల్పడిన ఆ చీకటి రోజులు రాష్ట్రంలో పోయి నెల దాటిందన్న మంత్రి లోకేష్‌.. కూటమి ప్రభుత్వం మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూడా కూకటివేళ్లతో పెకిలించి వేస్తోందన్నారు.

Read Also: IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్‌.. కెప్టెన్ రోహిత్ శర్మనే!

ప్రజా తీర్పుతో ఉనికి కోల్పోయిన జగన్.. తాను పేటెంటు పొందిన ఫేక్ ప్రచారాలతో అబద్దపు పునాదులపై మళ్లీ నిలబడాలని చూస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు లోకేష్.. అందుకే రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా హత్యా రాజకీయాలంటూ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాడు అని విమర్శించారు. శవాలతో రాజకీయాలు చేసే విష సంస్కృతికి వ్యతిరేకంగా ప్రజలిచ్చిన తీర్పే మొన్నటి ఎన్నికల ఫలితాలని ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలా? అని ప్రశ్నించారు. నేరాలు చేసి.. మళ్లీ వాటిని వేరే వారిపై నెట్టడం అనే జగన్ కపట నాటకాలకు కాలం చెల్లింది. ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నాం. ఏ ఘటననూ ఉపేక్షించేది లేదు.. ఏ నిందితుడినీ వదిలేది లేదు అని హెచ్చరించారు. ఇక, బెంగళూరు యలహంక ప్యాలెస్‌లో కూర్చుని ఇక్కడ కుట్రలు అమలు చేయాలంటే కుదరదు.. జగన్ హెచ్చరికలు భయపడే ప్రభుత్వం కాదు.. ప్రజలకు, వారి మానప్రాణాలకు జవాబుదారీగా ఉండే ప్రజా ప్రభుత్వం ఇది అని స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్‌.