Bhatti vs KTR : పాదయాత్ర చేసి భట్టి అలసిపోయారు.. చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాలం సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే.. ఈ రోజు అసెంబ్లీ భట్టవిక్రమార్క మాట్లాడుతూ.. నాకు పత్రికలు, మీడియా నుంచి సమాచారం ఉంది. ఏకగ్రీవం అయిన జీపీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న నిధులు ఇవ్వలేదు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి సర్పంచ్ లకు నిధులు రాక, చేసిన పనులకు బిల్లులు రాక చెప్పులు అరిగెల తిరుగుతున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో.. తన నియోజకవర్గానికి చెందిన సర్పంచ్ ఆనంద్ ఆరోగ్యం బాగాలేక చనిపోయారని ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ వివరణ ఇచ్చారు. సభను భట్టి తప్పు దోవ పట్టిస్తున్నారని ప్రశాంత్ రెడ్డి ఆక్షేపించారు. దీనిపై కేటీఆర్ మాట్లాడుతూ.. పాదయాత్ర చేసి భట్టి అలసిపోయారని, మీ బాధ అర్థం చేసుకుంటామన్నారు. మీరు ఇక్కడ కూర్చుంటే గాంధీ భవన్ లో మీ వెనుక గోతులు తొవ్వు తున్నారని, భట్టి చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయడం లేదని ఒకసారి, నిధులు ఇవ్వడం లేదని మరోసారి, అన్నింటికీ భూములు ఇస్తున్నారని ఒకసారి చెప్తున్నారన్నారు.
Also Read : Botsa Satyanarayana: చంద్రబాబు వల్లే పుంగనూర్ లో గొడవ జరిగింది..
Also Read
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్లో BLA-TTP వరస దాడులు..
మీ పార్టీలో క్లారిటీ లేదు.. మీకు క్లారిటీ లేదు : భట్టి కామెంట్స్ పై కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రజల్లో లేని అసమ్మతిని చెప్పే ప్రయత్నం ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. చిన్న పిల్లలకు ఎక్కాలు రావు… ప్రతిపక్ష పార్టీలకు లెక్కలు రావు అన్నట్లు ఉందని, ఒక వేలు మమ్మల్ని చుపిడితే.. నాలుగు వేళ్ళు ప్రతిపక్ష పార్టీలను చూపిస్తాయన్నారు. ఉన్నది నలుగురు ఎమ్మెల్యేలు అని, పదిమంది సీఎంలమని ప్రచారం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. ఎక్స్పైర్ అయిన మందు కాంగ్రెస్ అని, కాంగ్రెస్ విశ్వసనీయత పోయిందన్నారు మంత్రి కేటీఆర్. ఓట్ల కోసమే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని, మూడు నెలల్లో జరిగే ఎన్నికల కోసమే ప్రతిపక్షాలు ఆలోచిస్తే.. కేసీఆర్ రాబోయే వందేళ్ల కోసం ఆలోచిస్తున్నారన్నారు. మాకు కట్టడం మాత్రమే తెలుసు.. ప్రతిపక్షాలకు కులగొట్టడం మాత్రం తెలుసు అని, రాష్ట్ర బడ్జెట్ అంటే ప్రజల జీవనాడీ అని ఆయన అన్నారు.
Also Read : MLC Kavitha : మణిపూర్ అల్లర్లను కట్టడి చేయడంలో కేంద్రం విఫలం
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!