Minister KTR : బ్లాక్ లెవెల్ హ్యాండ్లూమ్ క్లస్టర్ల ఏర్పాటుకు నిధులు ఇవ్వాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి కేంద్ర ప్రభుత్వంపై డిమాండ్ల వర్షం కురిపించారు మంత్రి కేటీఆర్. తాజాగా ఆయన తెలంగాణ టెక్స్ టైల్ రంగానికి కేంద్ర బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. ‘తెలంగాణ నేతన్నల సంక్షేమం, టెక్స్ టైల్ రంగ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని ఎన్నో ఏండ్లుగా కోరుతున్నా.. కేంద్ర సహకారం లభించడం లేదు. ఆర్థిక మంత్రులు మారుతున్నారు కానీ కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అందుతున్నది శూన్యం.’ అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చేనేత, టెక్స్ టైల్ రంగ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకి కేంద్ర బడ్జెట్ లో ఈ సారైనా నిధులు ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్, సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ కి నిధులు కేటాయించాలన్నారు మంత్రి కేటీఆర్. టెక్స్ టైల్, చేనేత రంగం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జీఎస్టీని పూర్తిగా రద్దు చేస్తన్నట్టు బడ్జెట్ లో ప్రకటించాలన్నారు.
Also Read : Jagan – Bhupendra Yadav: కేంద్రమంత్రి భూపేంద్రతో భేటీలో జగన్ ప్రస్తావించిన అంశాలివే
బ్లాక్ లెవెల్ హ్యాండ్లూమ్ క్లస్టర్ ల ఏర్పాటుకు నిధులు ఇవ్వాలన్నారు. తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, నేషనల్ టెక్స్ టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హ్యాండ్లూమ్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు ప్రకటన చేయాలని, ఈసారైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ టెక్స్ టైల్ రంగ పురోగతికి నిధులు ఇస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేవారు. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాల లేమి, మౌలిక వసతుల కల్పన వైఫల్యంతో మేక్ ఇన్ ఇండియా కేవలం నినాదంగా మాత్రమే మిగిలిపోయిందని, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి చిన్న దేశాలతోనూ పోటీ పడలేని పరిస్థితిలో భారతదేశం ఉండడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వ విధానాలేనన్నారు. టెక్స్ టైల్, నేతన్నల పరిస్థితుల పై మోడీ సర్కార్ కు కనీస అవగాహన, చిత్తశుద్ది లేదని, తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రాల ప్రగతికి కేంద్రం సహకరించడం లేదన్నారు. నిధులు కేటాయించకుండా నేతన్నల సంక్షేమం అభివృద్ధినీ అడ్డుకోవద్దని కేటీఆర్ కోరారు. కేంద్రం ప్రవేశపెట్టే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ ఇది, ఇందులోనైన నేతన్నల పట్ల తమ చిత్తశుద్ధిని మోడీ ప్రభుత్వం చాటుకోవాలన్నారు.
Also Read
- V.D. Satheesan: "సతీశన్ అనే నేను".. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..
తాజావార్తలు
-
Rashmika Mandanna: కృతి హాట్నెస్పై రష్మిక బోల్డ్ కామెంట్స్..షాక్ అయిన ఫ్యాన్స్
-
KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
-
V.D. Satheesan: “సతీశన్ అనే నేను”.. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
-
Vijay Jana Nayagan : విజయ్ CM అయినా కూడా రిలీజ్ పై క్లారిటీ రాని జననాయగన్
-
Jayam Ravi: జయం రవి వ్యక్తిగత వివాదం ఎఫెక్ట్..నిర్మాతల్లో పెరిగిన ఆందోళన
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..