విజయవాడ ఇంద్రకీలాద్రిపై కృష్ణలంక కార్పోరేటర్ రామిరెడ్డికి మంత్రి కొట్టు సత్యనారాయణ క్లాస్ పీకారు. VVIP ఎంట్రీ గేట్ నుంచి దర్శనానికి పోలీసులు, రెవిన్యూ అధికారులు ఇష్టానుసారంగా తీసుకెళుతున్నారని మంత్రి దృష్టికి భక్తులు తీసుకొచ్చారు. చిన రాజగోపురం VVIP గేట్ దగ్గర పరిస్దితిని పరిశీలిస్తున్న సమయంలో తమ వారిని తీసుకొని గేటులో నుంచి కార్పొరేటర్ రామిరెడ్డి వెళుతున్నారు.. దీంతో రామిరెడ్డిని అడ్డుకొని బయటకి వెళ్లమన్న మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు.
Read Also: Samantha: అబ్బే… అదంతా ఒట్టిదే అంటున్న సమంత!
కృష్ణలంక కార్పోరేటర్ రామిరెడ్డి తమవారిని తీసుకుని 500 క్యూలైన్ లో వెళ్లమన్న మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. తప్పు చేయకుండా అడ్డుకోవాల్సిన మనమే తప్పు చేస్తామంటే ఎలా అంటూ మీడియా పాయింట్లో కార్పొరేటర్ రామిరెడ్డిని పిలిచి మరీ మంత్రి కొట్టు సత్యనారాయణ మందలించారు. రూల్ ఎవరికైన రూలే అని మంత్రి తెలిపారు. 500 టికెట్స్ ఉన్నాయని పంపమని అడిగినా.. మంత్రి వినలేదు.. 500 క్యూలైన్ లోనే కార్పొరేటర్ బంధువులను పంపాలని మంత్రి ఆదేశించారు. మంత్రి ఘాటుగా హెచ్చరించడంతో 500 క్యూలో దర్శనానికి కృష్ణలంక కార్పోరేటర్ రామిరెడ్డి వెళ్లిపోయారు.
Read Also: India-Canada Row: భారత్తో దౌత్యవివాదం.. కెనడాకు మద్దతుగా అమెరికా, యూకే..
అయితే, విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండపై ప్రస్తుతం నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏపీ ప్రభుత్వం దగ్గరుండి తగిన ఏర్పాట్లు చేసింది. సామాన్య భక్తుల దర్శనానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. అమ్మవారి దగ్గర అందరు సమానం ఎవరికి ఎలాంటి ప్రత్యేక దర్శనాలు లేవని ఆయన చెప్పుకొచ్చారు. వీవీఐపీ దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్స్ ఉన్నాయని ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు.