NTV Telugu Site icon

Karumuri Nageswara Rao: మాట ఇస్తే నిలబడే వ్యక్తి జగన్.. కుటుంబంలో అందరికీ మంచి చేసే వ్యక్తి..

Untitled Karumuri

Untitled Karumuri

Karumuri Nageswara Rao: మాట ఇస్తే నిలబడే వ్యక్తి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అంటూ ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. పశ్చిమ గోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం వైఎస్‌ జగన్.. మీకు మంచి చేశాను అనుకుంటేనే ఓటు వేయండి అని చెబుతున్నారు.. ఇలా చెప్పగలిగిన దమ్మున్న లీడర్‌ ఒక్క జగన్‌ మాత్రమే అన్నారు. ఇక, చంద్రబాబును మూడు సార్లు ముఖ్యమంత్రిని చేసిన ప్రజలు రెండు లక్షల కోట్లకు ఆస్తిపరుడిని చేశారని వ్యాఖ్యానించారు.. కానీ, ప్రజలు మాత్రం పేదవాళ్లుగా మిగిలిపోయారు. మీ సొమ్ము దోచుకుని మీ నెత్తిన చెయ్యిపెట్టాడు.. లేదంటే రాష్ట్రంలో మహిళలు మరింత ధనవంతులుగా ఉండేవాళ్లు అని పేర్కొన్నారు.. మరోవైపు.. 18 కేసుల్లో నిందితుడిగా చంద్రబాబు ఉన్నారని విమర్శలు గుప్పించారు. ఇక, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిలా కుటుంబంలో అందరికీ మంచి చేసే ముఖ్యమంత్రి ఎక్కడాలేరని స్పష్టం చేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.

Read Also: Mithun Chakraborty: గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్‌ నటుడు మిథున్ చక్రవర్తి!

ఇక, సీఎం జగన్‌ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్న వ్యక్తి సీఎం వైఎస్‌ జగన్‌.. అందుకే మళ్లీ సీఎంగా వైఎస్‌ జగనే కావాలని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గతంలో పేర్కొన్న విషయం విదితమే.. చంద్రబాబు హయాంలో 17వ స్థానంలో ఉన్న విద్యా వ్యవస్థ.. సీఎం జగన్‌ పాలనలో 3వ స్థానంలో ఉందని తెలిపారు.. అవినీతి లేని పాలన సీఎం జగన్‌ అందిస్తున్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పాలన అందిస్తున్నందుకు మళ్లీ సీఎంగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డే కావాలని అని వ్యాఖ్యానించిన విషయం విదితమే.