Minister Jogi Ramesh: లోకేష్, పవన్ కల్యాణ్పై మంత్రి సంచలన వ్యాఖ్యలు.. సినిమా టైటిల్.. ట్యాగ్లైన్ కూడా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Jogi Ramesh: నారా లోకేష్, పవన్ కల్యాణ్తో పాటు నందమూరి బాలకృష్ణపై మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. అంతే కాకుండా.. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర జరిగిన ఎపిసోడ్కు ఆయన ఓ సినిమా టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు.. ట్యాగ్లైన్ కూడా చెప్పుకొచ్చారు.. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఇద్దరు మెంటల్ కేసులు.. ఆ ఇద్దరి మధ్య పిచ్చి పీకే అంటూ.. లోకేష్, బాలయ్య, పవన్పై సెటైర్లు వేశారు.. ”ఇద్దరు మెంటలోళ్ల మధ్య పిచ్చి పీకే’ అనేది సినిమా టైటిల్.. బొక్కలో బాబు 7691 అనేది ట్యాగ్ లైన్ అని పేర్కొన్నారు. జైల్లో ఉన్న చంద్రబాబును పరామర్శించటానికి పవన్ కల్యాణ్ వెళ్లాడు.. బీజేపీతో సంసారం చేస్తూనే జైల్లోకి వెళ్లి చంద్రబాబుతో తాళి కట్టించుకున్నాడు.. బయటకు వచ్చి వైసీపీ ప్రభుత్వంపై యుద్ధం చేస్తాను అంటున్నాడంటూ మండిపడ్డారు.
Read Also: Flight Emergency: ప్రయాణికుల గుండె జారిపోయింది.. 10 నిమిషాల్లో 28వేల అడుగులకు విమానం.. ఏమైందంటే..?
Also Read
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 28 నుంచే ప్రారంభం..
- France: ఫ్రాన్స్లో ఎండలు భగభగ.. ఏసీల కోసం ఎగబడ్డ జనాలు
- Chilli Garlic Egg Salad Recipe: ఉదయాన్నే ఎనర్జీ కావాలా? 5 నిమిషాల్లో రెడీ.. రుచికరమైన హై-ప్రోటీన్ ఎగ్ సలాడ్
వైసీపీ, జగన్ పై యుద్ధం చేయటం అంటే రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలతో యుద్ధం చేయటమే అన్నారు మంత్రి జోగి రమేష్.. సీఎం వైఎస్ జగన్ పై యుద్ధం చేయటం అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకుంటున్న వితంతువులు, వికలాంగులు, వృద్ధులు, మహిళలపై యుద్ధం చేయటమే అన్నారు. ఇక, పవన్ కల్యాణ్ సినిమాల్లో హీరో, రాజకీయాల్లో జీరో అని అభివర్ణించారు. స్కిల్ కుంభకోణం జరిగిన టీడీపీ ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ భాగస్వామి అని ఆరోపించారు. 370 కోట్ల కుంభకోణంలో పవన్ కు ఎంత వాటా వచ్చింది? అని ప్రశ్నించారు. పవన్, చంద్రబాబు ఫెవికాల్ బంధం గురించి రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసన్నారు మంత్రి జోగి రమేష్.
Read Also: ODI World Cup2023: నేడే వన్డే వరల్డ్ కప్ ఫైనల్, సెమీ ఫైనల్ టిక్కెట్ల విక్రయం
లోకేష్ సిగ్గూ, శరం వదిలేశాడా? అంటూ ధ్వజమెత్తారు మంత్రి జోగి.. ఢిల్లీకి వెళ్ళి ఏం చెబుతాడు? అని ప్రశ్నించిన ఆయన.. మా అయ్య 370 కోట్ల రూపాయలు కొట్టేసి బొక్కలో ఉన్నాడని చెబుతాడా? లోకేష్ స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీ వెళ్లాడు.. చంద్రబాబు కోసం స్పెషల్ ఫ్లైట్ లో లాయర్లు వచ్చారు.. కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకుని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు అంటూ దుయ్యబట్టారు. ఇక, ఢిల్లీకి వెళ్లిన నారా లోకేష్.. ఓ పొలిటికల్ బ్రోకర్ను కలిశాడని విమర్శలు గుప్పించారు మంత్రి జోగి రమేష్.
తాజావార్తలు
-
Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 28 నుంచే ప్రారంభం..
-
France: ఫ్రాన్స్లో ఎండలు భగభగ.. ఏసీల కోసం ఎగబడ్డ జనాలు
-
Maa Inti Bangaram : సమంత ‘గోల్డెన్ రన్’.. 17 లక్షలకు పైగా టికెట్లతో ‘మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డ్!
-
Chilli Garlic Egg Salad Recipe: ఉదయాన్నే ఎనర్జీ కావాలా? 5 నిమిషాల్లో రెడీ.. రుచికరమైన హై-ప్రోటీన్ ఎగ్ సలాడ్
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!