Minister Jogi Ramesh: లోకేష్, పవన్ కల్యాణ్పై మంత్రి సంచలన వ్యాఖ్యలు.. సినిమా టైటిల్.. ట్యాగ్లైన్ కూడా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Jogi Ramesh: నారా లోకేష్, పవన్ కల్యాణ్తో పాటు నందమూరి బాలకృష్ణపై మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. అంతే కాకుండా.. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర జరిగిన ఎపిసోడ్కు ఆయన ఓ సినిమా టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు.. ట్యాగ్లైన్ కూడా చెప్పుకొచ్చారు.. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఇద్దరు మెంటల్ కేసులు.. ఆ ఇద్దరి మధ్య పిచ్చి పీకే అంటూ.. లోకేష్, బాలయ్య, పవన్పై సెటైర్లు వేశారు.. ”ఇద్దరు మెంటలోళ్ల మధ్య పిచ్చి పీకే’ అనేది సినిమా టైటిల్.. బొక్కలో బాబు 7691 అనేది ట్యాగ్ లైన్ అని పేర్కొన్నారు. జైల్లో ఉన్న చంద్రబాబును పరామర్శించటానికి పవన్ కల్యాణ్ వెళ్లాడు.. బీజేపీతో సంసారం చేస్తూనే జైల్లోకి వెళ్లి చంద్రబాబుతో తాళి కట్టించుకున్నాడు.. బయటకు వచ్చి వైసీపీ ప్రభుత్వంపై యుద్ధం చేస్తాను అంటున్నాడంటూ మండిపడ్డారు.
Read Also: Flight Emergency: ప్రయాణికుల గుండె జారిపోయింది.. 10 నిమిషాల్లో 28వేల అడుగులకు విమానం.. ఏమైందంటే..?
Also Read
- Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
- Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి - పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
వైసీపీ, జగన్ పై యుద్ధం చేయటం అంటే రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలతో యుద్ధం చేయటమే అన్నారు మంత్రి జోగి రమేష్.. సీఎం వైఎస్ జగన్ పై యుద్ధం చేయటం అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకుంటున్న వితంతువులు, వికలాంగులు, వృద్ధులు, మహిళలపై యుద్ధం చేయటమే అన్నారు. ఇక, పవన్ కల్యాణ్ సినిమాల్లో హీరో, రాజకీయాల్లో జీరో అని అభివర్ణించారు. స్కిల్ కుంభకోణం జరిగిన టీడీపీ ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ భాగస్వామి అని ఆరోపించారు. 370 కోట్ల కుంభకోణంలో పవన్ కు ఎంత వాటా వచ్చింది? అని ప్రశ్నించారు. పవన్, చంద్రబాబు ఫెవికాల్ బంధం గురించి రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసన్నారు మంత్రి జోగి రమేష్.
Read Also: ODI World Cup2023: నేడే వన్డే వరల్డ్ కప్ ఫైనల్, సెమీ ఫైనల్ టిక్కెట్ల విక్రయం
లోకేష్ సిగ్గూ, శరం వదిలేశాడా? అంటూ ధ్వజమెత్తారు మంత్రి జోగి.. ఢిల్లీకి వెళ్ళి ఏం చెబుతాడు? అని ప్రశ్నించిన ఆయన.. మా అయ్య 370 కోట్ల రూపాయలు కొట్టేసి బొక్కలో ఉన్నాడని చెబుతాడా? లోకేష్ స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీ వెళ్లాడు.. చంద్రబాబు కోసం స్పెషల్ ఫ్లైట్ లో లాయర్లు వచ్చారు.. కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకుని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు అంటూ దుయ్యబట్టారు. ఇక, ఢిల్లీకి వెళ్లిన నారా లోకేష్.. ఓ పొలిటికల్ బ్రోకర్ను కలిశాడని విమర్శలు గుప్పించారు మంత్రి జోగి రమేష్.
తాజావార్తలు
-
Shefali Shah: ప్రేమ,పెళ్లి.. పిల్లల కంటే పెట్స్ బెటర్.. షెఫాలీ షా బోల్డ్ కామెంట్స్ వైరల్
-
Virgin Girl Consent: కన్య మౌనం అంగీకారమే.. ఆఫ్ఘనిస్తాన్లో బాల్య వివాహాలకు తాలిబన్ ఆమోదం
-
Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Keerthy Suresh: అందుకే మీడియాకు ధూరంగా ఉన్న.. కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..