Minister Harish Rao: ఎవరెన్ని ట్రిక్కులు చేసిన హ్యాట్రిక్ మాత్రం కేసీఆర్ దే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెదక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి లీడర్లు దొరకక కాంగ్రెస్ పార్టీ అప్లికేషన్లు తీసుకుంటుంది అంటూ సెటైర్లు వేశారు. అభ్యర్థుల నుంచి ఫీజు కూడా తీసుకుని డబ్బులు వసూలు చేస్తుంది కాంగ్రెస్.. ఒక వేళ రేపు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా కాంగ్రెస్ అమ్మేస్తుంది.. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు బయటికి వస్తారని ఆయన అన్నారు.
Read Also: Jailer: ఇదిదా క్రేజ్ అంటే.. సీఎం యోగితో కలిసి జైలర్ చూస్తున్న రజనీ
Also Read
- Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?
- Abhishek Sharma: రికార్డుల వేటలో అభిషేక్ శర్మ.. ఆ క్లబ్లోకి కూడా చేరిన అభిషేక్.
- Heinrich Klaasen: ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న కాటేరమ్మ పెద్ద కొడుకు.. టాప్ 5లో ముగ్గురు హైదరాబాద్ ఆటగాళ్లే..
- Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక నుంచి రేషన్ షాపుల్లో అవి కూడా పంపిణీ..
ఎన్నికలు వచ్చినప్పుడు కనపడే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రజా బలం లేదు.. కేవలం మేకపోతు గాంబిర్యం ప్రదర్శిస్తున్నారు అని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కి లీడర్ లేరు.. బీజేపీకి క్యాడర్ లేదు అంటూ మంత్రి సెటైర్లు వేశాడు. ఇంటి ముందు అభివృద్ధి.. కంటి ముందు అభ్యర్థి ఇదే బీఆర్ఎస్ పార్టీ నినాదం అని హరీష్ రావు చెప్పారు.
Read Also: Bangladesh: ఆసియా కప్ కోసం ఆటగాళ్ల కష్టాలు.. జట్టు కోసం నిప్పులపై నడిచిన క్రికెటర్
రాష్ట్రంలో ఎవరెన్ని ట్రిక్కులు చేసిన హ్యాట్రిక్ మాత్రం కేసీఆర్ దే అని మంత్రి హరీష్ రావు అన్నారు. గత ఎన్నికల్లో కంటే ఎక్కువగా సీట్లు గెలుస్తాం.. కుర్చీ కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కొట్టుకుంటున్నాయి.. ప్రతి పక్షాలది తిట్లలో పోటీ.. బీఆర్ఎస్ కి దేశంలో తెలంగాణని నంబర్ వన్ స్థానంలో నిలపడంలో పోటీ.. ఈ నెల23న సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలో పర్యటించబోతున్నారు అని ఈ సందర్భంగా మంత్రి చెప్పుకొచ్చారు. ఉదయం బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆఫీసు, ఎస్పీ ఆఫీస్, జిల్లా కలెక్టరేట్ సమీకృత కార్యాలయాలను సీఎం ప్రారంభిస్తారని వెల్లడించారు. మెదక్ ఎంపీగా గెలిచి ప్రధాని అయినా ఇందిరాగాంధీ మెదక్ కి రైలు తేలేదు అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ ఆ కలని నిజం చేశాడు.. 23వ తేదీని ఒక వేడుకలాగా జరపాలి.. మద్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ కి కృతజ్ఞత సభ చర్చి గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్నామని హరీష్ రావు తెలిపారు.
తాజావార్తలు
-
Vaibhav Suryavanshi: అది బుడ్డోడి రేంజ్.. వైభవ్ సూర్యవంశీ కోసం వేలం వ్యూహాన్ని మార్చుకున్న రాజస్థాన్..!
-
Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
-
Abhishek Sharma: రికార్డుల వేటలో అభిషేక్ శర్మ.. ఆ క్లబ్లోకి కూడా చేరిన అభిషేక్.
-
Malayalam sequels : మలయాళ ఇండస్ట్రీలో సత్తా చాటుతోన్న సీక్వెల్స్.. వందల కోట్ల వసూళ్లతో రికార్డ్స్
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!