Minister Harish Rao: ఎవరెన్ని ట్రిక్కులు చేసిన హ్యాట్రిక్ మాత్రం కేసీఆర్ దే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెదక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి లీడర్లు దొరకక కాంగ్రెస్ పార్టీ అప్లికేషన్లు తీసుకుంటుంది అంటూ సెటైర్లు వేశారు. అభ్యర్థుల నుంచి ఫీజు కూడా తీసుకుని డబ్బులు వసూలు చేస్తుంది కాంగ్రెస్.. ఒక వేళ రేపు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా కాంగ్రెస్ అమ్మేస్తుంది.. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు బయటికి వస్తారని ఆయన అన్నారు.
Read Also: Jailer: ఇదిదా క్రేజ్ అంటే.. సీఎం యోగితో కలిసి జైలర్ చూస్తున్న రజనీ
Also Read
- Protein Food Demand: ప్రోటీన్ కోసం భారతీయుల తొలి ఎంపిక ఇవే.. ఆన్లైన్ ఆర్డర్లలో కొత్త రికార్డులు..!
- Praggnanandhaa - Magnus Carlsen: వరల్డ్ నం.1 కార్ల్సెన్ కు 'ప్రజ్ఞానంద' చెక్మేట్.!
- 144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
- Cucumber Soup Recipe: 10 నిమిషాల్లో తయారయ్యే చల్లటి దోసకాయ సూప్ తాగండి.. శరీరం కూల్, ముఖం గ్లోతో మెరిసిపోతుంది!
ఎన్నికలు వచ్చినప్పుడు కనపడే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రజా బలం లేదు.. కేవలం మేకపోతు గాంబిర్యం ప్రదర్శిస్తున్నారు అని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కి లీడర్ లేరు.. బీజేపీకి క్యాడర్ లేదు అంటూ మంత్రి సెటైర్లు వేశాడు. ఇంటి ముందు అభివృద్ధి.. కంటి ముందు అభ్యర్థి ఇదే బీఆర్ఎస్ పార్టీ నినాదం అని హరీష్ రావు చెప్పారు.
Read Also: Bangladesh: ఆసియా కప్ కోసం ఆటగాళ్ల కష్టాలు.. జట్టు కోసం నిప్పులపై నడిచిన క్రికెటర్
రాష్ట్రంలో ఎవరెన్ని ట్రిక్కులు చేసిన హ్యాట్రిక్ మాత్రం కేసీఆర్ దే అని మంత్రి హరీష్ రావు అన్నారు. గత ఎన్నికల్లో కంటే ఎక్కువగా సీట్లు గెలుస్తాం.. కుర్చీ కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కొట్టుకుంటున్నాయి.. ప్రతి పక్షాలది తిట్లలో పోటీ.. బీఆర్ఎస్ కి దేశంలో తెలంగాణని నంబర్ వన్ స్థానంలో నిలపడంలో పోటీ.. ఈ నెల23న సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలో పర్యటించబోతున్నారు అని ఈ సందర్భంగా మంత్రి చెప్పుకొచ్చారు. ఉదయం బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆఫీసు, ఎస్పీ ఆఫీస్, జిల్లా కలెక్టరేట్ సమీకృత కార్యాలయాలను సీఎం ప్రారంభిస్తారని వెల్లడించారు. మెదక్ ఎంపీగా గెలిచి ప్రధాని అయినా ఇందిరాగాంధీ మెదక్ కి రైలు తేలేదు అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ ఆ కలని నిజం చేశాడు.. 23వ తేదీని ఒక వేడుకలాగా జరపాలి.. మద్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ కి కృతజ్ఞత సభ చర్చి గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్నామని హరీష్ రావు తెలిపారు.
తాజావార్తలు
-
NTR : తెలుగువారి ఆత్మగౌరవం.. అఖండ తెలుగు జాతి కీర్తి పతాకం.. ‘ఎన్టీఆర్’ 103వ జయంతి సందర్భంగా ఘన నివాళి!
-
Protein Food Demand: ప్రోటీన్ కోసం భారతీయుల తొలి ఎంపిక ఇవే.. ఆన్లైన్ ఆర్డర్లలో కొత్త రికార్డులు..!
-
Kavya Maran Crying: ఎస్ఆర్హెచ్ దారుణ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన కావ్య పాప.. వీడియో వైరల్!
-
Praggnanandhaa – Magnus Carlsen: వరల్డ్ నం.1 కార్ల్సెన్ కు ‘ప్రజ్ఞానంద’ చెక్మేట్.!
-
Vaibhav Net Worth: “కోటీశ్వరుడే నండోయ్”.. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ నికర ఆస్తి విలువ ఎంతో తెలుసా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!