Minister Harish Rao: ఎవరెన్ని ట్రిక్కులు చేసిన హ్యాట్రిక్ మాత్రం కేసీఆర్ దే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెదక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి లీడర్లు దొరకక కాంగ్రెస్ పార్టీ అప్లికేషన్లు తీసుకుంటుంది అంటూ సెటైర్లు వేశారు. అభ్యర్థుల నుంచి ఫీజు కూడా తీసుకుని డబ్బులు వసూలు చేస్తుంది కాంగ్రెస్.. ఒక వేళ రేపు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా కాంగ్రెస్ అమ్మేస్తుంది.. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు బయటికి వస్తారని ఆయన అన్నారు.
Read Also: Jailer: ఇదిదా క్రేజ్ అంటే.. సీఎం యోగితో కలిసి జైలర్ చూస్తున్న రజనీ
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ఎన్నికలు వచ్చినప్పుడు కనపడే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రజా బలం లేదు.. కేవలం మేకపోతు గాంబిర్యం ప్రదర్శిస్తున్నారు అని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కి లీడర్ లేరు.. బీజేపీకి క్యాడర్ లేదు అంటూ మంత్రి సెటైర్లు వేశాడు. ఇంటి ముందు అభివృద్ధి.. కంటి ముందు అభ్యర్థి ఇదే బీఆర్ఎస్ పార్టీ నినాదం అని హరీష్ రావు చెప్పారు.
Read Also: Bangladesh: ఆసియా కప్ కోసం ఆటగాళ్ల కష్టాలు.. జట్టు కోసం నిప్పులపై నడిచిన క్రికెటర్
రాష్ట్రంలో ఎవరెన్ని ట్రిక్కులు చేసిన హ్యాట్రిక్ మాత్రం కేసీఆర్ దే అని మంత్రి హరీష్ రావు అన్నారు. గత ఎన్నికల్లో కంటే ఎక్కువగా సీట్లు గెలుస్తాం.. కుర్చీ కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కొట్టుకుంటున్నాయి.. ప్రతి పక్షాలది తిట్లలో పోటీ.. బీఆర్ఎస్ కి దేశంలో తెలంగాణని నంబర్ వన్ స్థానంలో నిలపడంలో పోటీ.. ఈ నెల23న సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలో పర్యటించబోతున్నారు అని ఈ సందర్భంగా మంత్రి చెప్పుకొచ్చారు. ఉదయం బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆఫీసు, ఎస్పీ ఆఫీస్, జిల్లా కలెక్టరేట్ సమీకృత కార్యాలయాలను సీఎం ప్రారంభిస్తారని వెల్లడించారు. మెదక్ ఎంపీగా గెలిచి ప్రధాని అయినా ఇందిరాగాంధీ మెదక్ కి రైలు తేలేదు అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ ఆ కలని నిజం చేశాడు.. 23వ తేదీని ఒక వేడుకలాగా జరపాలి.. మద్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ కి కృతజ్ఞత సభ చర్చి గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్నామని హరీష్ రావు తెలిపారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!