Minister Harish Rao : డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాంపల్లి ఏరియా హాస్పిటల్ లో 5 పడకల డయాలసిస్ కేంద్రం, బ్లడ్ బ్యాంక్ ను ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. డయాలసిస్ కేంద్రాల సంఖ్యను తెలంగాణ ప్రభుత్వంలో 3 నుంచి 102 కు పెంచాము అని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 12వేల మంది డయాలసిస్ చేయించుకుంటున్నారు, వారిలో 10వేల మందికి ఉచితంగా ప్రభుత్వం డయాలసిస్ చేయిస్తున్నది అని వైద్యారోగ్యశాఖ మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో డయాలసిస్ రోగులకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు ఆసరా పింఛను, ఉచిత బస్ పాస్కూడా ఇస్తున్నాము అని అన్నారు.
Also Read : Vizag Steel Plant: EOIపై ఆసక్తి చూపని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు
Also Read
- Deepika Padukone: ప్రెగ్నెంట్ అయితే రెస్ట్ తీసుకోవాలా.. మరో ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్.?
- Nara Lokesh: గణేష్ నిమజ్జనం వేళ డీజేలపై స్పందించిన లోకేష్.. హోంమంత్రి, డీజీపీకి విజ్ఞప్తి
- Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
- Ganesh Immersion Without Water: నీళ్లు లేవు గణపయ్య.. క్షమించవయ్యా.. ఎండిన కాలువలోనే విగ్రహాలు..
ప్రతి సంవత్సరం150 వరకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు జరుగుతున్నాయి అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆరోగ్య శ్రీ కింద 10 లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే భరిస్తున్నది.. బయట చేస్తే 20 లక్షల వరకు ఖర్చు అవుతుంది కానీ.. ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత అవసరమయ్యే మందులను కూడా ఉచితంగా జీవిత కాలం అందిస్తున్నాము అని ఆయన పేర్కొన్నారు. కిడ్నీ రోగుల కోసం ఏడాదికి 200 కోట్లు ఖర్చు చేస్తే, అందులో ఒక్క డయాలసిస్ రోగుల కోసం ఏడాదికి 100 కోట్లు ఖర్చు చేసున్నాం అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు తెలిపారు.
Also Read : Tiger : హైదరాబాద్ పరిసరాల్లో పులి సంచారం
తెలంగాణ ఏర్పడే నాటికి మన రాష్ట్రంలో 28 ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులు ఉంటే, ఇపుడు ఆ సంఖ్యను 56 కి పెంచుకున్నాము అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు తెలిపారు. 27 బ్లడ్ బ్యాంక్ లకు కాంపోనెంట్ సపరేటర్స్ ఇచ్చాము.. వాటి వల్ల ఒక యూనిట్ రక్తాన్ని ముగ్గురు నలుగురికి వాడుతున్నాం.. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ను త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తాం అని మంత్రి హరీశ్ రావు గుర్తు చేశారు. ఇందుకోసం బడ్జెట్లో సీఎం కేసీఆర్ 250 కోట్ల రూపాయలు కేటాయించారు అని వెల్లడించారు. 6.5 లక్షల మంది గర్భిణులకు వీటిని అందిస్తామన్నారు. ఇప్పటికే లక్ష కిట్లు జిల్లాలకు పంపించాం… మరో లక్ష సేకరిస్తున్నాం అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు అన్నారు.
తాజావార్తలు
-
Deepika Padukone: ప్రెగ్నెంట్ అయితే రెస్ట్ తీసుకోవాలా.. మరో ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్.?
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Nara Lokesh: గణేష్ నిమజ్జనం వేళ డీజేలపై స్పందించిన లోకేష్.. హోంమంత్రి, డీజీపీకి విజ్ఞప్తి
-
Asus: Asus Vivobook లైనప్లో కొత్త ల్యాప్టాప్లు.. S14, S16, 14 Flip, S14 Flip, Vivobook 16 లాంచ్
-
The Paradise : రూ.100 కోట్లు పలికిన ప్యారడైజ్ థియేట్రికల్ రైట్స్.. కానీ రికవరీ పరిస్థితి ఏంటి?
ట్రెండింగ్
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!