Minister Harish Rao : డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాంపల్లి ఏరియా హాస్పిటల్ లో 5 పడకల డయాలసిస్ కేంద్రం, బ్లడ్ బ్యాంక్ ను ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. డయాలసిస్ కేంద్రాల సంఖ్యను తెలంగాణ ప్రభుత్వంలో 3 నుంచి 102 కు పెంచాము అని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 12వేల మంది డయాలసిస్ చేయించుకుంటున్నారు, వారిలో 10వేల మందికి ఉచితంగా ప్రభుత్వం డయాలసిస్ చేయిస్తున్నది అని వైద్యారోగ్యశాఖ మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో డయాలసిస్ రోగులకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు ఆసరా పింఛను, ఉచిత బస్ పాస్కూడా ఇస్తున్నాము అని అన్నారు.
Also Read : Vizag Steel Plant: EOIపై ఆసక్తి చూపని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు
Also Read
- Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
- Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
- Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. "ఎక్స్" అకౌంట్ నిలిపివేత..
- YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
ప్రతి సంవత్సరం150 వరకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు జరుగుతున్నాయి అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆరోగ్య శ్రీ కింద 10 లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే భరిస్తున్నది.. బయట చేస్తే 20 లక్షల వరకు ఖర్చు అవుతుంది కానీ.. ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత అవసరమయ్యే మందులను కూడా ఉచితంగా జీవిత కాలం అందిస్తున్నాము అని ఆయన పేర్కొన్నారు. కిడ్నీ రోగుల కోసం ఏడాదికి 200 కోట్లు ఖర్చు చేస్తే, అందులో ఒక్క డయాలసిస్ రోగుల కోసం ఏడాదికి 100 కోట్లు ఖర్చు చేసున్నాం అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు తెలిపారు.
Also Read : Tiger : హైదరాబాద్ పరిసరాల్లో పులి సంచారం
తెలంగాణ ఏర్పడే నాటికి మన రాష్ట్రంలో 28 ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులు ఉంటే, ఇపుడు ఆ సంఖ్యను 56 కి పెంచుకున్నాము అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు తెలిపారు. 27 బ్లడ్ బ్యాంక్ లకు కాంపోనెంట్ సపరేటర్స్ ఇచ్చాము.. వాటి వల్ల ఒక యూనిట్ రక్తాన్ని ముగ్గురు నలుగురికి వాడుతున్నాం.. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ను త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తాం అని మంత్రి హరీశ్ రావు గుర్తు చేశారు. ఇందుకోసం బడ్జెట్లో సీఎం కేసీఆర్ 250 కోట్ల రూపాయలు కేటాయించారు అని వెల్లడించారు. 6.5 లక్షల మంది గర్భిణులకు వీటిని అందిస్తామన్నారు. ఇప్పటికే లక్ష కిట్లు జిల్లాలకు పంపించాం… మరో లక్ష సేకరిస్తున్నాం అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు అన్నారు.
తాజావార్తలు
-
Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!