Errabelli Dayakar Rao: చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలి.. ప్రధానికి ఎర్రబెల్లి పోస్టు కార్డులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Errabelli Dayakar Rao: చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రధాని మోడీకి పోస్ట్ కార్డు రాశారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు చేనేతపై విధించిన 5 శాతం జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తన స్వహస్తాలతో రాసిన పోస్టు కార్డు మంత్రి ఇవాళ పోస్ట్ చేశారు.
మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఒకవైపు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సమర్థవంతమైన పాలన ద్వారా చేనేతలకు ప్రోత్సాహకాలు ఇచ్చి కార్మికులను ఆదుకుంటుంటే.. మరోవైపు, కేంద్రం మాత్రం నడ్డి విరిచేలా 5 శాతం జీఎస్టీ విధించడం చాలా అన్యాయమన్నారు. రాష్ట్రంలో చేనేతలకు చేయూత, బీమా వంటి వినూత్న సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే.. కేంద్రం ప్రభుత్వం చేనేత కార్మికులపై కక్ష కట్టిందన్నారు. దేశంలో కీలక వ్యవసాయం తర్వాత ప్రజలు ఎక్కువగా ఆధారపడిన రంగం చేనేత అని మంత్రి అన్నారు. అలాగే, భారతదేశంలో ఎప్పుడూ, ఎక్కడా లేని విధంగా చేనేత రంగంపై విధించిన జీఎస్టీ ఇప్పటికైనా వెంటనే రద్దు చేయాలని మంత్రి ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.
Also Read
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
PM Narendra Modi: సరిహద్దులు భద్రంగా.. ఆర్థిక వ్యవస్థ దృఢంగా ఉంటేనే దేశం సురక్షితం
ఇటీవల చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలని మంత్రి కేటీఆర్ ప్రధానికి పోస్ట్ కార్డు పంపిన సంగతి తెలిసిందే. చేనేత కార్మికుల సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు లక్షలాది ఉత్తరాలు రాయాలని తెలంగాణ ప్రజలకు మంత్రి కేటీఆర్ సూచించారు. తానే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పోస్టుకార్డు రాశారు. చేనేత ఉత్పత్తులపై ఐదు శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని పోస్టుకార్డులో కేటీఆర్ డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల సమస్యలను అనేక సందర్భాల్లో వివిధ వేదికల ద్వారా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ.. సానుకూల స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన స్వదస్తూరీతో పోస్ట్ కార్డ్ రాశారు మంత్రి కేటీఆర్. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చేనేత సమస్యలను తన పోస్ట్ కార్డులో ప్రస్తావించిన కేటీఆర్.. రాష్ట్రంలోని నేతన్నలతోపాటు చేనేత వస్త్రాలపై ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు ప్రధానికి పోస్ట్ కార్డు రాయాలన్నారు.
చేనేత మీద కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ వెంటనే తొలగించాలని మంత్రి శ్రీ @KTRTRS గారి పిలుపు మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పోస్ట్ కార్డ్ రాయడం జరిగింది.#RollbackHandloomGST pic.twitter.com/QUWO5abp0w
— Errabelli Dayakar Rao (@EDRBRS) October 24, 2022
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!