Minister Errabelli : దేవుళ్ల పేరుతో రాజకీయం చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Errabelli : దేవుళ్ల పేరుతో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాజకీయం చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం పర్యటించారు. శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని, నూతనధర్మకర్తల మండలి ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పాలకుర్తిని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానని మంత్రి దయాకర్ రావు హామీ ఇచ్చారు. కవులు, కళాకారులను గుర్తించిన గొప్ప వ్యక్తిగా సీఎం కేసీఆర్ ను ఆయన కొనియాడారు. 63 కోట్లరూపాయలతో బొమ్మెర, పాలకుర్తి, వాల్మీడిని టూరిజం హబ్ గా తీర్చి దిద్దుతున్నట్లు ప్రకటించారు.
Read Also: Revanthreddy : అప్పుడు గవర్నర్ స్పందిస్తే.. ఇప్పుడు ఇబ్బంది ఉండేది కాదు
Also Read
- IND Vs IRE: పసికూన చేతిలో భారత్ ఘోర ఓటమి.. ఎగిరిగంతేసిన ఐర్లాండ్ అభిమానులు..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మతతత్వ పార్టీ అని.. దేవుళ్ళ పేరు చెప్పుకుని రాజకీయం చేస్తున్న పార్టీగా అభివర్ణించారు. రాష్ట్రంలోని దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. రాబోవు మహశివరాత్రికి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పాలకుర్తి విచ్చేస్తారని మంత్రి దయాకర్ రావు వెల్లడించారు. కాజీపేట్ (మం) బాలవికాస పీపుల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్… బాలవికాస ఫౌండర్ ఆధ్వర్యంలో 20 మాసాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
Read Also: Petrol Rate: అక్కడ బంకుల్లో కంటే బ్లాక్ లోనే రేటు తక్కువట
దేశాన్ని పాలించే సత్తా ఒక్క కేసీఆర్కే ఉందన్నారు మంత్రి ఎర్రబెల్లి. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లోని అభివృద్ధి, సంక్షేమంపై, తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలపై చర్చకు సిద్ధమా? మిషన్ భగీరథ మీద చర్చకు వస్తారా? గ్రామాల అభివృద్ధిపై వస్తారా? అని మంత్రి సవాల్ విసిరారు. దేశమంతా సీఎం కేసీఆర్ను ఆదర్శంగా తీసుకుంటుంటున్నారని, కంటి వెలుగును తమ రాష్ర్టాల్లోనూ అమలు చేస్తామని ఖమ్మం సభలోనే పలువురు సీఎంలు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు.
తాజావార్తలు
-
IND Vs IRE: పసికూన చేతిలో భారత్ ఘోర ఓటమి.. ఎగిరిగంతేసిన ఐర్లాండ్ అభిమానులు..
-
Kishan Reddy : అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్
-
Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
-
Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్ను వీడనున్న కింగ్ చార్లెస్!
-
Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!