Minister Errabelli : దేవుళ్ల పేరుతో రాజకీయం చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Errabelli : దేవుళ్ల పేరుతో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాజకీయం చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం పర్యటించారు. శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని, నూతనధర్మకర్తల మండలి ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పాలకుర్తిని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానని మంత్రి దయాకర్ రావు హామీ ఇచ్చారు. కవులు, కళాకారులను గుర్తించిన గొప్ప వ్యక్తిగా సీఎం కేసీఆర్ ను ఆయన కొనియాడారు. 63 కోట్లరూపాయలతో బొమ్మెర, పాలకుర్తి, వాల్మీడిని టూరిజం హబ్ గా తీర్చి దిద్దుతున్నట్లు ప్రకటించారు.
Read Also: Revanthreddy : అప్పుడు గవర్నర్ స్పందిస్తే.. ఇప్పుడు ఇబ్బంది ఉండేది కాదు
Also Read
- Beerakaya Chutney Recipe: పప్పు, అన్నంతో అదిరే రుచి.. కారం కారంగా బీరకాయ చట్నీ ఇలా చేస్తే వేళ్లు కూడా వదలరు..!
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
- Australia: 61 మంది మహిళలపై పైశాచికత్వం! ఆస్ట్రేలియాలో భారత సంతతి చెందిన వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష
- Story Board: దేశంలో S.I.R ఉద్దేశమేంటి..? జరుగుతున్నదేంటి..?
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మతతత్వ పార్టీ అని.. దేవుళ్ళ పేరు చెప్పుకుని రాజకీయం చేస్తున్న పార్టీగా అభివర్ణించారు. రాష్ట్రంలోని దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. రాబోవు మహశివరాత్రికి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పాలకుర్తి విచ్చేస్తారని మంత్రి దయాకర్ రావు వెల్లడించారు. కాజీపేట్ (మం) బాలవికాస పీపుల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్… బాలవికాస ఫౌండర్ ఆధ్వర్యంలో 20 మాసాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
Read Also: Petrol Rate: అక్కడ బంకుల్లో కంటే బ్లాక్ లోనే రేటు తక్కువట
దేశాన్ని పాలించే సత్తా ఒక్క కేసీఆర్కే ఉందన్నారు మంత్రి ఎర్రబెల్లి. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లోని అభివృద్ధి, సంక్షేమంపై, తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలపై చర్చకు సిద్ధమా? మిషన్ భగీరథ మీద చర్చకు వస్తారా? గ్రామాల అభివృద్ధిపై వస్తారా? అని మంత్రి సవాల్ విసిరారు. దేశమంతా సీఎం కేసీఆర్ను ఆదర్శంగా తీసుకుంటుంటున్నారని, కంటి వెలుగును తమ రాష్ర్టాల్లోనూ అమలు చేస్తామని ఖమ్మం సభలోనే పలువురు సీఎంలు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు.
తాజావార్తలు
-
Adarsha Kutumbam: వెంకీ – త్రివిక్రమ్ సినిమాలో వెంకటేశ్ పాత సాంగ్ రీమిక్స్..?
-
Rajnikanth : రజనీ అనేవాడు అలంటి వాడు కాదు.. ఆ పనులు ఎప్పడు చేయను
-
Beerakaya Chutney Recipe: పప్పు, అన్నంతో అదిరే రుచి.. కారం కారంగా బీరకాయ చట్నీ ఇలా చేస్తే వేళ్లు కూడా వదలరు..!
-
IPL 2026 Black Tickets: జోరుగా బ్లాక్ టికెట్ దందా.. కీలక అధికారి ప్రమేయం.. ఒక్కో టికెట్ రూ.80 వేలు!
-
Peddi: ‘పెద్ది’ శాటిలైట్ డీల్ లాక్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..