Revanthreddy : అప్పుడు గవర్నర్ స్పందిస్తే.. ఇప్పుడు ఇబ్బంది ఉండేది కాదు
Revanthreddy : గవర్నర్ వ్యవస్థ అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి కాదని టీపీసీసీ రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రపతికి రాష్ట్రానికి వారధిలా గవర్నర్ ఉంటారని ఆయన తెలిపారు. గవర్నర్ కి ఇవ్వాల్సిన గౌరవం తప్పకుండా ఇవ్వాల్సిందే అని సూచించారు. హైదరాబాదులో శాంతి భద్రతల బాధ్యత 2024వరకు గవర్నర్ కు ఉంటాయని రేవంత్ స్పష్టం చేశారు. ఎంపీ లను హౌస్ అరెస్ట్ చేసినా పట్టించుకోవడం లేదు. గవర్నర్ తన అధికారాలు ఉపయోగించడం లేదన్నారు. తమకు అన్యాయం జరిగినప్పుడు గవర్నర్ స్పందిస్తే.. ఇప్పుడు గవర్నర్ కి ఈ ఇబ్బంది ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ రాజ్యాంగ ఉల్లంఘన చేసినప్పుడు… గవర్నర్ స్పందిస్తే బాగుండేది. ఇప్పుడు గవర్నర్ వరకు సమస్య వచ్చింది కాబట్టి అందరూ తనకు అనుకూలంగా మాట్లాడాలి అనుకుంటున్నారు. ఇద్దరు తమిళనాడు నుండి వచ్చిన గవర్నర్లు.. kcr కాంగ్రెస్ ని చంపుతున్నాడు కదా అని వదిలేశారు. ఇప్పుడు కేసీఆర్ గవర్నర్ లనే ఇబ్బంది పెడుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.. ఇప్పుడు అర్థం అయ్యింది కేసీఆర్ గురించి గవర్నర్ లకు అంటూ ప్రసంగించాడు.
Read Also: Delhi: ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్కు వేధింపులు.. వీడియో వైరల్
Also Read
ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ సభలో గవర్నర్ల వ్యవస్థపై ముఖ్యమంత్రులు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ గవర్నర్ తమిళిసై కౌంటర్ ఇచ్చారు. సీఎంలుగా ఉండి గవర్నర్ వ్యవస్థను ఎలా అవహేళన చేస్తారని ప్రశ్నించారు. గవర్నర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ అవమానించారని ఆమె వాపోయారు. ఏడాది నుంచి ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. తెలంగాణలో ఎందుకు ప్రోటోకాల్ పాటించడం లేదని నిలదీశారు. ఈ విషయంపై టీపీసీసీ రేవంత్ రెడ్డి స్పందించారు. గవర్నర్లపై ఎందుకింత చిన్నచూపన్నారు. ముఖ్యమంత్రులుగా ఉండి గవర్నర్ వ్యవస్థను ఎలా అవహేళన చేస్తారని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!