Botsa Satyanarayana: సీఎం జగన్కు మంత్రి బొత్స కృతజ్ఞతలు.. అందుకే చంద్రబాబుకు కడుపు మంట..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంఖుస్థాపన చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ.. ఇంత అద్భుతమైన కార్యక్రమం జరిగితే ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కడుపు మంటగా ఉంది అంటూ ఫైర్ అయ్యారు.. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా చేసిన పోరాటం వల్లనే చంద్రబాబు 2,300 ఎకరాల భూ సేకరణకు కుదించారన్న ఆయన.. ఇది వాస్తవం కాదా? భోగాపురం విభజన చట్టంలో ఉన్న విమానాశ్రయం కాదా? ఆ రోజు టీడీపీ నేత, కేంద్ర మంత్రిగా ఉన్న అశోక్ గజపతి రాజు ఎందుకు హాజరు కాలేదు? ప్రజల నుంచి తిరుగుబాటు ఉంటుందని భయపడే దాక్కున్నాడు అన్నది వాస్తవం కాదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.. ఇక, చంద్రబాబు ఏం పని చేసినా రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.
Read Also: CM YS Jagan: రైతులకు గుడ్న్యూస్ చెప్పిన సీఎం జగన్..
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
మరోవైపు, సిట్ ఏర్పాటుపై ఏపీ హైకోర్టు స్టేను ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై స్పందించిన మంత్రి బొత్స.. నాలుగు రోజులు ఆగితే అన్ని బయటకు వస్తాయి.. ఏం తప్పు చేయకపోతే కోర్టులకు వెళ్లి స్టేలు ఎందుకు తెచ్చుకుంటున్నారు? అని ప్రశ్నించారు.. ఒకవైపు కోర్టు కేసులు వేస్తూ మరోవైపు ఏం చేయలేకపోయారు అనే రాగాలు ఎందుకు? అని ఎద్దేవా చేశారు మంత్రి బొత్స సత్యానారాయణ. కాగా, బుధవారం నాడు భోగాపురం ఎయిర్ పోర్టుకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేసిన విషయం విదితమే.. 2026లో ఈ ఎయిర్ పోర్టును తాను ప్రారంభించనున్నట్టుగా ఆశాభావం వ్యక్తం చేశారు. మెడికల్, టూరిజం, ఐటీ, ఇండస్ట్రీకి భోగాపురం కేంద్ర బిందువుగా మారనుందన్న ఆయన.. గతంలో చంద్రబాబు ఎన్నికలకు రెండు మాసాల ముందు హడావుడిగా శంకుస్థాపన చేశారని విమర్శించారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు ఎలాంటి అనుమతులు తీసుకొకుండానే శంకుస్థాపనలు చేశారని ఆరోపించారు. కానీ, తమ ప్రభుత్వం భోగాపురం ఎయిర్ పోర్టుకు అన్ని రకాల అనుమతులు తీసుకుందని ఆయన గుర్తు చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టు పనులకు ఆటంకం కల్గించేందుకు కోర్టుల్లో కేసులు వేశారంటూ పరోక్షంగా టీడీపీ నేతలపై సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!