Minister Botsa: ఇన్నాళ్లు చంద్రబాబు టక్కుటమారా విద్యలతో బయటపడ్డారు..
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 26 వ తేదీ నుంచి వైసీపీ సామాజిక న్యాయ యాత్ర బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది అని వైసీపీ జోనల్ ఇంచార్జ్, జిల్లా ఇంచార్జ్ మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. సమ సమాజ స్దాపన కోసం సీఎం జగన్ కృషిచేస్తున్నారు.. ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు తెలియ చెప్పడానికే సామాజిక న్యాయ యాత్ర చేయాలని పార్టీ నిర్ణయించింది.. దేశంలోనే ఏపీలో మాత్రమే సామజిక న్యాయం జరిగింది అని ఆయన అన్నారు. ఏలూరు బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన మాట నిలబెట్టుకొవడానికి జగన్ కృషి చేసారు.. బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చారు అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
Read Also: Leo Movie: ‘లియో’ లైన్ క్లియర్.. ఇక ‘కేసరి’తో ఢీకొట్టడమే లేటు!
Also Read
- Swati Maliwal: ఆప్కు స్వాతి మాలివాల్ గుడ్బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
- Iran-US Talks: ఇస్లామాబాద్లో అసిమ్ మునీర్తో ఇరాన్ బృందం భేటీ
- Ramchander Rao: "కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు".. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
బీసీలు సీఎం జగన్ ను కాపాడుకొవాల్సిన అవసరం ఉంది అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రతిపక్షాలు ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు మాటాడుతున్నారు.. తప్పు చేసి, స్కాంలు చేసి రిమాండ్ లో ఉంటే కేసే తప్పంటారు.. గజదొంగల్లా దోచుకు తిన్నారు.. ఇన్నాళ్లు చంద్రబాబు టక్కుటమారా విద్యలతో బయటపడ్డారు అని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు ఆరోగ్యం బావుందా లేదా కుటుంబం కోర్టును ఆశ్రయించాలి అని బొత్స హితవు పలికారు. టీడీపీ అబద్దాలు చెప్పడానికి తయారుగా ఉంటుంది.. రానున్న ఎన్నికలలో ఇచ్చాపురంలొ వైసీపీ జెండా ఎగర వేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
Read Also: Tarmarind Cultivation : రైతులకు సిరులు కురిపిస్తున్న చింత సాగు..
దోచుకు తినడం, ఆటలు సాగటం లేదు కనుక సీఎం జగన్ పోవాలంటున్నారు అని మంత్రి బొత్స అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొపైల్ రేడి చేసిన ప్రభుత్వం ఎక్కడైనా ఉందా?.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పెట్టి అరోగ్యం అందిస్తున్నాం.. విద్య, వైద్యం కోసం ఎంతగానో కృషిచేస్తున్నాం.. పేదరిక నిర్మూలన కోసం జగన్ కృషి చేస్తున్నారు.. సెలబ్రిటీ లాంటి వ్యక్తులు అవాకులు చవాకులు పేలుతున్నారు.. సీఎంను ప్రభుత్వాలు ఏకవచనంతో మాటాడుతున్నారు అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Swati Maliwal: ఆప్కు స్వాతి మాలివాల్ గుడ్బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
-
RCB: మ్యాచ్ గెలిచినా ఆర్బీబీ ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్లోనే తొలి టీమ్గా..
-
Iran-US Talks: ఇస్లామాబాద్లో అసిమ్ మునీర్తో ఇరాన్ బృందం భేటీ
-
Ramchander Rao: “కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు”.. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!