Ambati Rambabu: కోడెల శివప్రసాద రావు ఆత్మహత్యకు కారణం చంద్రబాబే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. చంద్రబాబు సత్తెనపల్లి సభ అట్టర్ఫ్లాప్ అయిందని కామెంట్స్ చేశారు. కానీ ప్రచారం మాత్రం ఆర్భాటంగా చెప్పుకున్నారన్నారు. సత్తెనపల్లి సభకు జనం రాకపోయినా అద్భుతం అనడం చంద్రబాబు ఖర్మ అంటూ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు సభకు జనం నుంచి స్పందన కరువైందన్నారు చంద్రబాబు ఒక రాజకీయ సైకో అంటూ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆయన ఒక్క నిజమైనా చెప్పారా.. అన్నీ అబద్ధాలేనని, చంద్రబాబును మించిన సైకో ఈ రాష్ట్రంలో ఎవరూ లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారం లేకపోతే బతకలేడని విమర్శించారు. చంద్రబాబు అధికారం కోసం ఎవరితోనైనా కలుస్తాడని.. తిట్టినవారిపై కూడా ప్రశంసలు కురిపిస్తారని మంత్రి ఎద్దేవా చేశారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్క పేదవాడినైనా ధనవంతుడిని చేశారా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు రూ. 2 లక్షల కోట్లు ఇచ్చారని అన్నారు. కోడెల శివప్రసాద్ మరణానికి తాను కారణమని నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.
Read Also:
Also Read
- New Rules: విమాన ప్రయాణికులకు అలర్ట్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ ఇవే!
- Gautam Gambhir: సారాంశ్ జైన్కు ఛాన్స్..? కుల్దీప్ యాదవ్పై గంభీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్
- Pakistan: మరింత శక్తివంతంగా అసిమ్ మునీర్.. కీలక చట్టానికి పాకిస్తాన్ ఆమోదం..
- Rahul Gandhi: రాహుల్ గాంధీ పూణె టూర్కు ముందు ఉద్రిక్తతలు.. 50 మంది అరెస్ట్
40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు.. నువ్వు పేదల్ని ధనవంతుల్ని చేశావా అంటూ ప్రశ్నించారు. కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు చంద్రబాబే కారణమన్న అంబటి రాంబాబు.. కోడెల ఉరివేసుకోవడానికి ప్రధాన కారణం చంద్రబాబేనని ఆరోపించారు. ఆయన కుటుంబానికి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబేనన్నారు. కోడెల శివప్రసాద్పై అనేక ఆరోపణలు వచ్చాయని, ప్రజలు ఫిర్యాదులు చేశారని.. వాటిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి యాక్షన్ తీసుకునేందుకు ప్రయత్నం చేశామని చెప్పారు. ఇందులో ఎలాంటి దాపరికం లేదని తెలిపారు. ఇదేమైనా అరాచమా? వేధింపులా? అని ప్రశ్నించారు. ఆ కేసులకు భయపడి కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడం కంటే అబద్దం ఉంటుందా? అని ప్రశ్నించారు. చంద్రబాబుబు తప్పిదం వల్లే పోలవరం ఆలస్యమైందని ఆయన ఆరోపణలు చేశారు. కాపర్ డ్యాం కట్టకుండా డయాఫ్రం వాల్ కట్టారని.. చంద్రబాబు తప్పిదం వల్ల రూ.2వేల కోట్లు నష్టం జరిగిందని మంత్రి అన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం ఆంబోతులకు ఆవులను సరఫరా చేయడమేనని మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, లోకేష్, కోడెల శివప్రసాద్ల కన్నా తాను వంద రెట్లు నీతిమంతుడునని తెలిపారు. తెలుగుదేశం వాళ్లకు కూడా అన్యాయం జరగకూడదని అనుకునే వ్యక్తిని తానని చెప్పారు.
తాజావార్తలు
-
New Rules: విమాన ప్రయాణికులకు అలర్ట్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ ఇవే!
-
Chiranjeevi – Odela Movie Update: మెగాస్టార్ బర్త్డే స్పెషల్.. చిరు – ఓదెల మూవీపై బిగ్ క్లారిటీ! ఆ సినిమా ఆగిపోలేదట..
-
Gautam Gambhir: సారాంశ్ జైన్కు ఛాన్స్..? కుల్దీప్ యాదవ్పై గంభీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్
-
Pakistan: మరింత శక్తివంతంగా అసిమ్ మునీర్.. కీలక చట్టానికి పాకిస్తాన్ ఆమోదం..
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ పూణె టూర్కు ముందు ఉద్రిక్తతలు.. 50 మంది అరెస్ట్
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!