AP Election 2024: ఎన్నికలు రాబోతున్నాయి.. రెండు మూడు వారాల్లో నోటిఫికేషన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Election 2024: రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి.. రెండు మూడు వారాల్లో నోటిఫికేషన్ కూడా వస్తుంది అని వ్యాఖ్యానించారు మంత్రి అంబటి రాంబాబు.. ఇక, వైసీపీ ఎన్నికలకు సర్వం సిద్ధంగా ఉందన్న ఆయన.. టీడీపీ, జనసేన ఎన్నికలకు ముందే ఓటమి అంగీకరించే పరిస్థితి ఉందన్నారు. కుప్పంలో భువనేశ్వరి పోటీ చేస్తారంట.. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతాడు అని తెలుసుకున్నారు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ ఘనవిజయం సాధించినప్పుడే, చంద్రబాబు ఓటమి ఖాయం అయిపోయిందన్నారు కుప్పానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా తాగు, సాగునీరు ఇవ్వబోతున్నాం… కుప్పంలో చంద్రబాబు బండారం బయటపడింది.. గతంలో దొంగ ఓట్లతో కుప్పంలో గెలిచిన చంద్రబాబుకు ఈసారి అలాంటి ఛాన్స్ లేదన్నారు. కుప్పంలో నిలబడి ఓడిపోవడం కంటే రెస్ట్ తీసుకోవడం బెటర్ అని చంద్రబాబుకు తెలుసంటూ సెటైర్లు వేసిన ఆయన.. అందుకే భువనేశ్వరి నేను పోటీ చేస్తాను అంటున్నారని దుయ్యబట్టారు.
Read Also: Jharkhand: హేమంత్ సోరెన్కు కోర్టులో చుక్కెదురు
Also Read
- New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్ర పేరుతో మరో ఐపీఎల్ టీం..
- అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
- Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
- Kamal Haasan: కమల్హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
రాబోయే ఎన్నికల్లో డబ్బు పెట్టి గెలవాలని చేగువేరా వారసుడు అని చెప్పుకునే పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నాడు అంటూ ఫైర్ అయ్యారు అంబటి.. బీజేపీతో పొత్తులో ఉండి చంద్రబాబుతో మంతనాలు చేస్తే పార్టీలు తిట్టవా..? అని ప్రశ్నించారు. ఒక పొత్తులో ఉన్న పార్టీకి సమాచారం లేకుండా, మరొక పార్టీతో పొత్తు పెట్టుకుంటే జాతీయ పార్టీలు తిట్టకుండా ఏం చేస్తాయన్న ఆయన.. టీడీపీ-జనసేన గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాయి… ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో వాళ్లకే తెలియడం లేదన్నారు. చంద్రబాబు రెస్ట్ తీసుకునే మూడ్లో ఉన్నాడు.. భవిష్యత్తులో టీడీపీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్.. రెస్ట్ తీసుకోవడమే మిగిలిందన్నారు.
Read Also: Hyderabad: నగరంలోని బ్లడ్ బ్యాంకులపై డ్రగ్ కంట్రోల్ బ్యూరో సోదాలు..
గతంలో కాంగ్రెస్ పార్టీలో పెరిగిన వ్యక్తి, ఇప్పుడు టీడీపీలో చేరి.. నా మీద పోటీకి వస్తున్నాడు.. జాతీయ పార్టీలో ఉండి ఆ పార్టీకి ద్రోహం చేసిన విశ్వాస ఘాతకుడు అని మండిపడ్డారు అంబటి.. ఇప్పుడు వైసీపీ ఎంపీ అనిల్ మీద పోటీ చేయడానికి వస్తున్న వ్యక్తి, వైసీపీ వల్ల ఎంపీ అయి పార్టీకి నమ్మకద్రోహం చేసిన విశ్వాసఘాతకుడు అని విరుచుకుపడ్డారు. ఇలాంటి వాళ్లకు ఓట్లు వేస్తామా లేదా ? ప్రజల ఆలోచించుకోవాలన్న ఆయన.. విశ్వాస పాత్రులకు ఓటు వేస్తారా? విశ్వాసఘాతకులకు ఓటు వేస్తారా? వారే తేల్చుకోవాలన్నారు. ఎన్టీఆర్ కు నమ్మకద్రోహం చేసిన విశ్వాసఘాతకుల పార్టీ టీడీపీ.. నమ్మకద్రోహుల ముఠాగా టీడీపీ నాయకులు మారిపోయారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి రాంబాబు.
తాజావార్తలు
-
New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్ర పేరుతో మరో ఐపీఎల్ టీం..
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
-
AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ!.
-
Mega Family : మెగా ఫ్యామిలీకి DSP దూరం ?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!