Minister Adimulapu Suresh: జనసేన అధినేత పవన్ కల్యాణ్కు సవాల్ విసిరారు మంత్రి ఆదిమూలపు సురేష్.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. పవన్ కల్యాణ్కు దమ్ము, ధైర్యం ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్దులతో ఇంగ్లీష్ లో మాట్లాడాలని మరోసారి చాలెంజ్ విసిరారు.. గతంలో ఇదే విషయంపై నేను చాలెంజ్ చేసినా పవన్ కల్యాణ్ పట్టించుకోలేదన్నారు. ఇక, కనిగిరిలో ఇప్పటి వరకూ అగ్రవర్ణాల నేతలే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వచ్చారు.. తొలిసారిగా సీఎం జగన్ ఓ బీసీకి సీటు ఇచ్చి గెలిపించారు.. ఎవరెన్ని చెప్పినా మరోసారి కనిగిరిలో వైసీపీనే గెలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు దళితులను కించపరుస్తూ వచ్చారు.. రాష్ట్రంలో ఆర్దిక సాధికారిత కోసం ప్రత్యేక పథకాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుంది.. మహిళా సాధికారిత కోసం ప్రతీ పదవిలో సగం వాటా ఇచ్చిన ఘనత సీఎం జగన్దే అన్నారు.
Read Also: Jana Reddy: తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన అంతం కావాలి..
ఇక, విద్య, వైద్యం, వ్యవసాయంలో రాష్ట్రం ముందంజలో ఉంది.. దళితులకు విద్య శాఖ మంత్రి అవకాశం కూడా ఇచ్చిన సీఎం మరోకరు ఉన్నారా..? అని ప్రశ్నించారు ఆదిమూలపు.. దళితుల పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చిన సీఎం జగనేనన్న ఆయన.. పవన్ కల్యాణ్కు దమ్ము, ధైర్యం ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్దులతో ఇంగ్లీష్ లో మాట్లాడాలని చాలెంజ్ చేసినా పట్టించుకోలేదన్నారు.. పవన్ కల్యాణ్ లా ఒక్కో ఎన్నికలకు ఒక్కోక్కరి పల్లకి మోసే రకం కాదు మేం కాదు.. ప్రతీవర్గం మరోసారి సీఎంగా జగనన్నకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్.