Minister Adimulapu Suresh: సంక్షేమం, అభివృద్ధి మా ప్రభుత్వానికి రెండు కళ్లు.. పేదరికం విద్యకు అడ్డు కాకూడదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Adimulapu Suresh: సంక్షేమం, అభివృద్ధి మా ప్రభుత్వానికి రెండు కళ్లు.. పేదరికం విద్యకు అడ్డు కాకూడదు అన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.. విజయవాడలో నిర్వహించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఒకరోజు కాంక్లేవ్లో ఆయన మాట్లాడుతూ.. సామాజిక న్యాయ శిల్పం ఆవిష్కరణ ముందు జరిగే కాంక్లేవ్ ఎంతో అద్భుతం అన్నారు. విద్యా విధాన విలువలకు అంబేద్కర్ కదపలేని పునాదిగా అభివర్ణించారు. పేదరికం విద్యకు అడ్డు కాకూడదు.. పేదరికంలో ఉన్నవారు విద్యకు దూరం కాకూడదన్న ఆయన.. అందుకే జగనన్న ప్రభుత్వంలో సామాజిక న్యాయం, సాజిక సాధికారత ముఖ్యంగా జరిగాయి.. సంక్షేమం, అభివృద్ధి ఈ ప్రభుత్వం యొక్క రెండు కళ్లుగా పేర్కొన్నారు.
Read Also: Adani Group: తెలంగాణలో అదానీ గ్రూప్ పెట్టుబడులు.. రూ.12,400 కోట్ల ఇన్వెస్ట్మెంట్
Also Read
- Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
- Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
- Vaibhav Sooryavanshi: వైభవ్ విజయం వెనుక ఉన్న అసలు హీరో ఇతడేనా? ఐపీఎల్ అంతా నీడలా వెంట నడిచిన మెంటార్!
- TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
చిట్ట చివరి కుటుంబానికి కూడా సంక్షేమం అందాలి అని పని చేశామని తెలిపారు సురేష్.. ఏ పథకాలైనా అట్టడుగు వర్గాలకు చేరాలి అని పని చేశాం.. విద్య మీద మా ప్రభుత్వం ప్రధాన దృష్టి పెట్టింది.. కేంద్రం రైట్ టు ఎడ్యుకేషన్ అంటే మా ప్రభుత్వం రైటు టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని మార్చి అమలు చేసిందన్నారు. తెలుగు భాష గౌరవం తగ్గకుండా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని అమలు చేశామని వెల్లడించారు. ఇక, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భావజాలం పుణికి పుచ్చుకుని అమలు చేసిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం.. కేబినెట్లో 70 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉన్నారని తెలిపారు. చట్ట సభల్లో ఇవాళ్లి వరకూ అడుగుపెట్టని కులాలను పార్లమెంటు వరకూ తిసుకెళ్లిన వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. ఆలయ పాలకమండలిల్లో, అధ్యక్ష పదవులలో దళితులకు అవకాశం ఇచ్చిన వ్యక్తి సీఎం జగన్ అన్నారు. మరోవైపు.. విగ్రహం నిర్మించిన స్ధలం చాలా కాలంగా ఖాళీగా ఉంది.. ఆ స్ధలాన్ని గత ప్రభుత్వంలో వ్యాపార ధోరణిలోనే చూశారు.. సామాజిక స్పృహ లేకుండా గత ప్రభుత్వంలో ఆలోచించారని మండిపడ్డారు మంత్రి ఆదిమూలపు సురేష్.
తాజావార్తలు
-
Jos Buttler: నెహ్రా నిర్ణయంతో షాకైన జోస్ బట్లర్.. గుజరాత్ ఫైనల్ ఓటమి వెనుక అసలు కథ ఇదే!
-
Vivek Agarwal’s Family: విధి ఆడిన వింత నాటకం.. తండ్రి కోసం వచ్చి ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి!
-
Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
-
Lagaan Re Release Date : 25 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి ఆమిర్ ఖాన్ ‘లగాన్’… మచ్చటగా మూడు రోజులు మాత్రమే.!
-
Sophie Ecclestone Fielding: గల్లీ క్రికెట్లో కూడా ఇలా ఆడరమ్మ.. ఇంగ్లండ్ స్టార్ సోఫీ ఎక్లెస్టోన్ను ఆడేసుకుంటున్న నెటిజెన్స్!
ట్రెండింగ్
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!