Adimulapu Suresh: దళిత యువకుడిపై దాడి, మూత్రవిసర్జన ఘటన.. టీడీపీకి మంత్రి సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adimulapu Suresh: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో దళిత యువకుడు శ్యామ్కుమార్పై దాడి ఘటనలో టీడీపీ నేతలకు సవాల్ విసిరారు మంత్రి ఆదిమూలపు సురేష్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దళిత యువకుడిపై దాడి ఘటనపై స్పందించారు.. యువకునిపై దాడి చేసిన ఘటన చాలా బాధాకరం అన్నారు.. ఈ ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించారు. దాడి చేసిన వ్యక్తులపై ఇప్పటికే కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అయితే, ఈ ఘటనను టీడీపీ రాజకీయాలకు వాడుకోవాలని చూడటం నీచమైన చర్యగా మండిపడ్డారు. తప్పు చేసిన వాళ్లు ఏ పార్టీ వాళ్లైనా శిక్ష తప్పదు అని హెచ్చరించారు.. ఇటువంటి ఘటనలను మా ప్రభుత్వం సహించదని హెచ్చరించారు.. చట్టం ముందు ఎవరైనా సమానమే.. టీడీపీ నాయకులకు ప్రతి విషయాన్ని రాజకీయం చేయటం అలవాటుగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: PM Modi: దేశంలో మరో ఐదేళ్ల పాటు ఉచిత రేషన్.. ప్రధాని సంచలనం
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
మరోవైపు.. ఈ కేసులో తాను జోక్యం చేసుకున్నానని టీడీపీ నేతలు ఆరోపణలు చేయటాన్ని ఖండించిన ఆయన.. కంచికచర్ల పోలీసులతో నేను మాట్లాడినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్దమని సవాల్ విసిరారు మంత్రి ఆదిమూలపు సురేష్.. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో దళిత యువకుడు శ్యామ్కుమార్ను కారులో తిప్పుతూ దారుణంగా హింసించిన ఘటన కలకలం రేపింది.. అంబేద్కర్ కాలనీకి చెందిన శ్యామ్కుమార్ను.. మాట్లాడాలని పిలిచి.. బుధవారం రాత్రి కారులో ఎక్కించుకున్న ఆరుగురు యువకులు.. గుంటూరు వైపు కారును తీసుకెళ్లారు.. దారిపొడవునా తీవ్రంగా కొట్టడమే కాదు.. దాహంగా ఉందని నీటి కోసం బతిమిలాడగా.. కారును నిర్మానుష్య ప్రదేశంలో ఆపి.. ముఖంపై మూత్రవిసర్జన చేశారని బాధితుడు కన్నీరు మున్నీరయ్యారు.. శరీరంపై రక్తపు మరకలు ఉండటంతో.. చొక్కాను తీసేసి.. మరో టీషర్టు తొడిగించారని.. పాత కక్షలను మనసులో పెట్టుకునే.. ఇలా దాడి చేసి ఉంటారని పేర్కొన్నాడు.. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేశామని.. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.. ఎఫ్ఐఆర్లో ఐదుగురి పేర్లను చేర్చినట్లు తెలిపారు. అయితే, బాధితుడిని పరామర్శించిన టీడీపీ నేతలు.. ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో తీవ్రంగా మండిపడ్డారు మంత్రి ఆదిమూలపు సురేష్.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!