PM Modi: దేశంలో మరో ఐదేళ్ల పాటు ఉచిత రేషన్.. ప్రధాని సంచలనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi:ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంచలన ప్రకటన చేశారు. ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తున్నట్లు ఛత్తీస్గఢ్లోని దుర్గ్లో ప్రధాని మోడీ ప్రకటించారు. దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందించే పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు బీజేపీ ప్రభుత్వం పొడిగించాలని నిర్ణయించుకున్నట్లు మోడీ తెలిపారు. మోసం తప్ప పేదలకు కాంగ్రెస్ ఎప్పుడూ ఏమీ ఇవ్వలేదని మోడీ అన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ పేదలను గౌరవించ లేదన్నారు. పేదల బాధలు వారికి ఎప్పుడూ అర్థం కావన్నాడు. అందుకే కాంగ్రెస్.. అధికారంలో ఉన్నంత కాలం పేదల హక్కులను దోచుకుని తిని నాయకులంతా తమ ఖజానాను నింపుకున్నారంటూ మండి పడ్డారు. 2014లో ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. పేదరికాన్ని నిర్మూలించగలమని విశ్వాసం కలిగించామన్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో 13.5 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారని మోడీ అన్నారు. పేదరికం నుంచి బయటపడిన వారే నేడు మోదీకి కోట్లాది దీవెనలు ఇస్తున్నారని తెలిపారు. ప్రతి పేదవాడు తన పేదరికాన్ని అంతమొందించే అతిపెద్ద సైనికుడిగా మారి మోడీకి తోడుగా ఉండేలా కొత్త విధానాలను రూపొందించామన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎంతో ఓర్పు, నిజాయితీతో పని చేసింది. మోడీకి ప్రజా సేవకుడు.. మీ అందరికీ సోదరుడు.. అతనో పేదవాడని అభివర్ణించుకున్నాడు. దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా పేదలకు ఉచిత రేషన్ అందేలా బీజేపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని ప్రధాని అన్నారు. అందుకే వన్ నేషన్-వన్ రేషన్ కార్డ్ సౌకర్యం కల్పించామన్నారు.
Also Read
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
- MK Stalin: 'డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్'.. విజయ్పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
- New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
Read Also:Revanth Reddy: బండి సంజయ్ కి బుర్ర పని చేస్తున్నట్టు లేదు.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం మహాదేవ్ పేరును కూడా వదిలిపెట్టలేదని ప్రధాని అన్నారు. కేవలం 2 రోజుల క్రితం రాయ్పూర్లో భారీ చర్య తీసుకోబడింది, భారీగా డబ్బు కుప్ప దొరికింది. ఛత్తీస్గఢ్లోని పేదలు, యువతను దోచుకుని కూడబెట్టిన ఈ డబ్బు స్పెక్యులేటర్లు, జూదరులకు చెందినదని ప్రజలు చెబుతున్నారు. ఈ డబ్బుల తంతు ఛత్తీస్గఢ్కు వెళుతున్నట్లు మీడియాలో వస్తోంది. దుబాయ్లో కూర్చున్న ఈ స్కామ్ నిందితులతో ఛత్తీస్గఢ్ ప్రజలకు ఎలాంటి సంబంధాలున్నాయో ప్రభుత్వం, ముఖ్యమంత్రి చెప్పాలని ప్రశ్నించారు.
జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం దేశంలోని 80 కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ను అందజేస్తుంది. డిసెంబర్ 2022లో ఈ పథకం ఒక సంవత్సరం పాటు పొడిగించబడింది. ఈ పథకం వల్ల కేంద్ర ప్రభుత్వంపై ఏటా రూ.2 లక్షల కోట్ల అదనపు భారం పడుతోంది. పేదలు రేషన్ కోసం ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. గత ఏడాది కేబినెట్ సమావేశం తర్వాత కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ మంత్రి పీయూష్ గోయల్ జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం, ప్రభుత్వం బియ్యం, గోధుమలు, ముతక ధాన్యాలను వరుసగా కిలోకు రూ. 3,2,1 చొప్పున అందజేస్తుందని చెప్పారు. డిసెంబర్ 2023 వరకు పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతకుముందు సెప్టెంబర్ 2022లో ప్రభుత్వం ఈ పథకం గడువును మూడు నెలల పాటు డిసెంబర్ 31 వరకు పొడిగించింది. కోవిడ్ సమయంలో పేద ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. 28 నెలల్లో ప్రభుత్వం పేదలకు ఉచిత రేషన్ కోసం రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నారు.
Read Also:Kane Williamson: జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు.. రికార్డు బద్దలు కొట్టాడు! 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో
కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన మార్చి 2020లో అమలు చేయబడింది. దేశంలోని 80 కోట్ల మంది ప్రజలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. దీని కింద బీపీఎల్ కార్డులున్న కుటుంబాలకు ప్రతినెలా ఒక్కొక్కరికి 4 కిలోల గోధుమలు, కిలో బియ్యం ఉచితంగా అందజేస్తారు. ఈ పథకం గత కొన్ని నెలలుగా విస్తరిస్తోంది.
తాజావార్తలు
-
ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
-
Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
-
MK Stalin: ‘డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. విజయ్పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!