Game Changer: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీగా పోలీసు బందోబస్తు
- నేడు రాజమండ్రి వేదికగా మెగా ఈవెంట్.
- గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీగా పోలీసు బందోబస్తు
- పవన్ కళ్యాణ్ తో సహా పలువురు హాజరు కానున్న నేతలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Game Changer Pre-Release Event: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా జనవరి 10న గ్రాండ్గా విడుదల కానుంది. జనవరి 2న సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. ఇక ట్రైలర్ మెగా అభిమానులకు విపరీతంగా నచ్చింది. అభిమానుల అంచనాలను రెట్టింపు చేసేలా ఉన్న ట్రైలర్ విడుదల కావడంతో సినిమా విడుదల కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే నేడు (జనవరి 4)వ తేదీన రాజమండ్రి వేదికగా ఈ మెగా ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ రోజుల్లో సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లు భారీగా జరుగుతున్న నేపథ్యంలో “గేమ్ ఛేంజర్” ప్రీ రిలీజ్ ఈవెంట్కు ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా రాజకీయ, సినీ ప్రముఖుల హాజరు కాబోతుండడంతో ఉభయగోదావరి జిల్లాల మెగా అభిమానులు రాజమండ్రికి చేరుకుంటున్నారు.
Also Read: Sydney Test: కెప్టెన్ రోహిత్ శర్మను అవమానించారు.. బీసీసీఐపై సిద్ధూ సీరియస్
Also Read
- IND Vs IRL: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ సమయాల్లో మార్పులు.. రేపటి మ్యాచ్ సమయం ఇదే..
- CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
- Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
- DK Shivakumar: తుంగభద్ర వేదికగా నీటి ఐక్యత సందేశం ఇచ్చిన డీకే శివకుమార్
ఈ సందర్భంగా, 400 మంది పోలీసు అధికారులతో పాటు, 1200 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు కోసం సమకూర్చారు. కోల్ కత్తా – చెన్నై జాతి రహదారిపై ట్రాఫిక్ మళ్లింపు అమలు చేస్తున్నారు. అలాగే, ఈవెంట్ జరుగుతున్న గ్రౌండ్ సమీపంలోని వేమగిరి, బొమ్మూరు వద్ద జాతీయ రహదారిపై కూడా ట్రాఫిక్ ను మళ్లించారు. గోదావరి నాలుగో వంతెన మీదగా భారీ వాహనాలు దివాన్ చెరువు వద్ద జీరో పాయింట్ డైవర్షన్ చేయబడతాయి. గ్రౌండ్ సమీపంలో 20వేల వాహనాలు పట్టేలా ఐదు పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ ఈవెంట్ సందర్భంగా, వేదిక ముందు బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు, హై మాక్స్ లైట్లు కూడా ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. అభిమానులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే, అభిమానులు తమ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈవెంట్లో సురక్షితంగా ఉండాలని సూచించారు. ఈ ఈవెంట్ ఫీవర్లో ఉభయగోదావరి జిల్లాల మెగా అభిమానులు ఎంట్రీ పాసుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, నిర్వాహకులు ఈ వేడుకకు 50,000 నుంచి 70,000 వరకు పాసుల మాత్రమే అందుబాటులో ఉంచారు.
తాజావార్తలు
-
SSC Supplementary Results : టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ సారి కూడా అమ్మాయిలే టాప్.!
-
RC 17 : కన్ఫ్యూజన్లో పడేసిన సుకుమార్
-
IND Vs IRL: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ సమయాల్లో మార్పులు.. రేపటి మ్యాచ్ సమయం ఇదే..
-
CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
-
Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!