IPL 2025 Auction: బీసీసీఐ చెత్త నిర్ణయం తీసుకుంది: మైకేల్ వాన్
- నవంబర్ 24, 25వ తేదీల్లో వేలం
- నవంబర్ 22 నుంచి పెర్త్ టెస్ట్
- మైకేల్ వాన్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025 మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో వేలం జరగనుంది. వేలానికి 1,574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా.. ఫ్రాంచైజీల సూచనల మేరకు బీసీసీఐ 574 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. 574 మందిలో 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి 10 ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. వేలంలో ఈసారి టీమిండియా స్టార్స్ ఉండడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఎవరు ఎంత ధరకు అమ్ముడవుతారని ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, వ్యాఖ్యాత మైకేల్ వాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ ఓ చెత్త నిర్ణయం తీసుకుందన్నాడు.
నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత కాలమాన ప్రకారం.. పెర్త్ టెస్టు ఉదయం 7.50 గంటలకు మొదలై.. మధ్యాహ్నం 2.50కు పూర్తవుతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ జరిగే మూడు, నాలుగు రోజుల్లోనే ఐపీఎల్ 2025 మెగా వేలం జరగనుంది. టెస్ట్ మ్యాచ్ పూర్తయిన పది నిమిషాలకు వేలం ఆరంభం అవుతుంది. తొలి టెస్టు జరిగే రోజుల్లోనే వేలం నిర్వహించడం వల్ల ప్లేయర్స్ ఏకాగ్రత కోల్పోయే ప్రమాదం ఉందని మైకేల్ వాన్ అన్నాడు. తొలి టెస్టు, రెండో టెస్టుకు మధ్యలో 9 రోజుల సమయం ఉందని.. ఆ టైమ్లో ఆక్షన్ నిర్వహిస్తే బాగుండని అభిప్రాయపడ్డాడు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
Also Read: Umpire Injury: అయ్యో ఎంతపనాయె.. అంపైర్ కన్ను, మూతి పగిలిపోయాయిగా! పెర్త్ మైదానంలోనే
మైఖేల్ వాన్ను కోడ్ స్పోర్ట్స్ ఛానెల్లో మాట్లాడుతూ… ‘ఆస్ట్రేలియా, భారత్ తొలి టెస్టు మధ్యలో ఐపీఎల్ 2025 వేలం నిర్వహించడాన్ని నేను అంగీకరించను. ఇది బీసీసీఐ తీసుకున్న చెత్త నిర్ణయం. తొలి టెస్టు, రెండో టెస్టుకు మధ్యలో 9 రోజుల సమయం ఉంది. టెస్టు జరుగుతున్న సమయంలో ప్లేయర్లు ఒత్తిడికి గురవుతారని తెలిసినపుడు.. ఆ సమయంలో వేలాన్ని ఎందుకు నిర్వహించకూడదు’ అని ప్రశ్నించాడు. వాన్ చెప్పింది నిజమే అని కొందరు మాజీలు అంటున్నారు. ప్లేయర్స్ వేలంపై మనసు పెడతారని, ఆటపై పెట్టారని అంటున్నారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..