MGNREGS: ఉపాధి హామీకి కౌంట్ డౌన్.. ఫుల్ పవర్స్ వారికే..
- మే 1 నుంచి కొత్త రూల్స్..
- 100 నుంచి 125 రోజులకు పెరగనున్న పని దినాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం మే 1 నుంచి పెను మార్పులు తీసుకురాబోతోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS), ఇకపై వీబీ జీ రామ్ జీ (VB GRAMJI – వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్) గా కొత్త రూపు సంతరించుకోనుంది. కేవలం పేరు మార్పు మాత్రమే కాకుండా.. పని దినాల సంఖ్య, పనుల ఎంపిక .. అమలు తీరులో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పనుల గడువు ఈ నెలాఖరుతో ముగియనుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉత్కంఠ నెలకొంది.
ఉపాధి హామీలో సరికొత్త మార్పులు..
కేంద్రం ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానం వల్ల కూలీలకు , గ్రామ పంచాయతీలకు కొన్ని కీలక ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఇప్పటివరకు ఒక కుటుంబానికి ఏడాదికి 100 రోజుల పని కల్పించగా, కొత్త పథకంలో ఆ గడువును 125 రోజులకు పెంచారు. దీనివల్ల కూలీల వార్షిక ఆదాయం పెరగనుంది. అంతే కాకుండా.. గతంలో పనుల ఎంపికలో మండల స్థాయి అధికారుల జోక్యం ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు గ్రామ అవసరాలను బట్టి అక్కడి పంచాయతీలే పనులను ఎంచుకునే అధికారం కల్పించారు. అంటే ఫుల్ పవర్స్ గ్రామ పంచాయతీలకే ఇచ్చారు.
Also Read
- Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
- Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
- India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
- Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్లో భూకంపం..
Also Read:Health Tips: స్నానం ఎప్పుడు చేస్తే మంచిది.. ఉదయం లేదా సాయంత్రం..?
కేవలం మట్టి పనులకే పరిమితం కాకుండా అంగన్వాడీ భవనాలు, స్కూల్ టాయిలెట్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, చెక్ డ్యామ్ల వంటి శాశ్వత నిర్మాణాలకు కూడా దీనిలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కొత్త పథకంలో 266 రకాల పనులను చేర్చినప్పటికీ.. గతంలో రైతులకు ఎంతో మేలు చేసిన కొన్ని పనులను తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ముఖ్యంగా.. చెరువుల నుంచి పొలాలకు ఒండ్రుమట్టి తరలింపు, వ్యక్తిగత పొలాల్లో భూమిని చదును చేయడం, పిచ్చిమొక్కలు లేదా కంపచెట్ల తొలగింపు వంటి పనులకు ఇకపై అనుమతి ఉండదు.
ఒండ్రుమట్టి వల్ల పొలాలు సారవంతం అవుతాయని, ఈ పనులను మే నెల వరకు పొడిగించాలని రైతులు కోరుతున్నారు. అయితే కేంద్ర మార్గదర్శకాల ప్రకారం పాత పద్ధతిలో చేసే పనులన్నీ ఈ ఏప్రిల్ 30 లోపు పూర్తి చేయాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఈ వారం రోజుల్లోనే పనులు పూర్తి చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు మాత్రం భూ అభివృద్ధి పనులకు కొంత మినహాయింపు లభించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!