Memantha Siddham Bus Yatra: ముగిసిన జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. 86 నియోజకవర్గాల మీదుగా సాగి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Memantha Siddham Bus Yatra: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ రోజు ముగిసింది.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇడుపులపాయలో బస్సు యాత్ర ప్రారంభించిన సీఎం జగన్.. 86 నియోజకవర్గాల మీదుగా సాగిన బస్సు యాత్రను ఈ రోజు అక్కవరం ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభతో ముగించారు. 22 రోజులు పాటు 2100 కిలోమీటర్ల మేర ఈ బస్సు యాత్ర సాగగా.. యాత్రలో భాగంగా 16 బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు వైసీపీ అధినేత.. వివిధ వర్గాలతో 6 ప్రత్యేక సమావేశాలలో పాల్గొన్నారు. 9 చోట్ల భారీ రోడ్ షోలలో పాల్గొన్నారు.. ఇడుపులపాయలో ప్రారంభమై 86 నియోజకవర్గాల మీదుగా సాగింది..
రెండోసారి అధికారమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ్టితో ముగిసింది. మార్చి 27న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన యాత్ర.. ఇవాళ శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని అక్కవరంలో ఎండ్ అయింది. మొత్తం 2100 కిలోమీటర్ల మేర బస్సుయాత్ర సాగింది. మొత్తం 86 నియోజకవర్గాల్లో పర్యటించిన జగన్… ఇప్పటివరకు 16 బహిరంగసభలు, 6 ప్రత్యేక సమావేశాలు, 9చోట్ల భారీ రోడ్షోలో పాల్గొన్నారు.
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
సిద్ధం సభలు జరగని జిల్లాలను టార్గెట్ చేసి.. ఈ యాత్ర షెడ్యూల్ ఫిక్స్ చేశారు. విశాఖపట్నం జిల్లా భీమిలి, ఏలూరు జిల్లా దెందులూరు, అనంతపురం జిల్లా రాప్తాడు, మార్చి 10న ప్రకాశం జిల్లా మేదరమెట్లలో చివరిదైన నాలుగో సిద్ధం సభ నిర్వహించారు. ఆ సభలు జరగని పార్లమెంట్ నియోజకవర్గాల్లో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా జనాల్లోకి వెళ్లారు జగన్. మార్చి 27న కడప జిల్లా ప్రొద్దుటూరులో బహిరంగ సభ జరిగింది. తర్వాత రోజు నద్యాలలో, ఆ తర్వాతి రోజు ఎమ్మిగనూరులో సభ నిర్వహించారు. రంజాన్ సందర్భంగా అనంతపురం జిల్లా కదిరిలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు జగన్. ఉదయం వివిధ వర్గాలతో సమావేశాలు, తర్వాత బస్సుయాత్ర, సాయంత్రం బహిరంగ సభ.. ఇలా క్రమం తప్పకుండా ఓ పద్ధతి ప్రకారం జరిగింది మేమంతా సిద్ధం బస్సు యాత్ర. ప్రతి జిల్లాలోనూ భారీగా జనస్పందన వచ్చింది. ఆ జిల్లా ఈ జిల్లా అనే తేడా లేదు. ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం అనే భేదం లేదు. ఎక్కడ బస్సుయాత్ర జరిగినా.. జగన్ కోసం జనం తరలివచ్చారు. ప్రతీ సభలో జగన్ ర్యాంప్ వాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మేమంతా సిద్ధం యాత్రలో ప్రజలతో జగన్ కలసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బస దగ్గరికి వచ్చిన వారందరినీ పలకరించి వారి కష్టసుఖాలు తెలుసుకున్న తరువాతే ఆరోజు యాత్రను మొదలుపెట్టేవారు జగన్. ఇలా ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు యాత్ర సాగించారు జగన్. ఇప్పుడు మూడో విడత ప్రచారానికి సిద్ధమవుతున్నారు.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?