Manifesto: ఈ నెలలో మేఘాలయ ఎన్నికలకు ముందు, ముఖ్యమంత్రి, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అధ్యక్షుడు కాన్రాడ్ కె.సంగ్మా శుక్రవారం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఐదు లక్షల ఉద్యోగాల కల్పన, ప్రతి గ్రామానికి ప్రభుత్వ సేవలు., మేఘాలయను దేశంలోని రాష్ట్రాల్లో టాప్ 10లో ఉంచుతామని హామీ ఇచ్చారు. విజన్ డాక్యుమెంట్ యువతకు అవకాశాలు, ఉపాధిని సృష్టించడం, రైతులు, గ్రామాలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుందని సంగ్మా అన్నారు. ఇందులో “ప్రామిసెస్ డెలివర్డ్” అనే పేరుతో కీలక విజయాల సారాంశం, మెరుగైన మేఘాలయ మేకింగ్ కథ కూడా ఉంది.
Helmets For Sikh Soldiers: సిక్కు సైనికులకు హెల్మెట్?.. తీవ్రంగా వ్యతిరేకించిన గురుద్వారా
ఉపముఖ్యమంత్రి ప్రిస్టోన్ టిన్సాంగ్, మంత్రి స్నియావ్భలాంగ్ ధర్, రాలియాంగ్ ఎమ్మెల్యే కమింగోన్ యంబోన్, జోవై ఎమ్మెల్యే వైలద్మికి షిల్లా, ఎన్పీపీ తూర్పు షిల్లాంగ్ అభ్యర్థి అంపరీన్ లింగ్దోహ్ ఇతర నాయకుల సమక్షంలో మేనిఫెస్టోను సంగ్మా ఆవిష్కరించారు. రాష్ట్ర పౌరులకు సేవ చేయడంలో పార్టీ గత ఐదేళ్లలో అనేక మైలురాళ్లను సాధించిందనే ఆలోచనను ఈ పత్రం పొందుపరుస్తుందని నేషనల్ పీపుల్స్ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇది పౌరులందరికీ మెరుగైన సమాజాన్ని రూపొందించడానికి బలమైన పునాదిని వేస్తుందని ప్రకటించింది. ఎన్పీపీ ఈ మేనిఫెస్టోను పీపుల్స్ డాక్యుమెంట్గా పిలుస్తోంది.