Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి సినిమాల విషయంలో రూట్ మార్చారు. వరుసగా యువ దర్శకులకు, ముఖ్యంగా లెక్కల మాస్టర్ సుకుమార్ శిష్యులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఫ్యాన్స్లో భారీ అంచనాలను రేకెత్తిస్తున్నారు. ఇప్పటికే పలు చిత్రాలతో బిజీగా ఉన్న బాస్, తాజాగా సుకుమార్ శిష్యుడైన దర్శకుడు శ్రీనివాస్ (శ్రీను) చెప్పిన కథకు ఫిదా అయినట్లు సమాచారం. ఈ చిత్రం పూర్తి స్థాయి గ్రామీణ నేపథ్యంతో సాగే బలమైన కథాంశం అని సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. సుకుమార్ స్కూల్ నుంచి వచ్చే దర్శకులు సహజత్వానికి దగ్గరగా, రూటెడ్ ఎలిమెంట్స్తో సినిమాలు తీస్తారనే పేరుంది. ఇప్పుడు శ్రీనివాస్ కూడా చిరంజీవి కోసం అటువంటి ఒక పవర్ఫుల్ విలేజ్ స్టోరీని సిద్ధం చేశారని, దానికి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
READ ALSO: Samsung 18000mAh: సామ్ సంగ్ బ్యాటరీ రెవల్యూషన్.. 18,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీపై ఫోకస్!
చిరంజీవి ప్రస్తుతం సుకుమార్ శిష్యులతో వరుసగా సినిమాలు లాక్ చేయడం విశేషం. ఇప్పటికే ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఒడేల దర్శకత్వంలో చిరు హీరోగా ఒక భారీ ప్రాజెక్ట్ ఖరారైంది. ఇప్పుడు తాజాగా శ్రీనివాస్ (శ్రీను) తో మరో సినిమా ఫిక్స్ అయ్యింది. సుకుమార్ శిష్యులు ప్రస్తుతం టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. వారి మేకింగ్ స్టైల్ మెగాస్టార్ ఇమేజ్కు తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గత కొంతకాలంగా చిరంజీవి తన పంథా మార్చుకున్నారు. కేవలం సీనియర్ డైరెక్టర్లకే కాకుండా, కొత్త తరం ఆలోచనలకు తగ్గట్టుగా యంగ్ డైరెక్టర్లకు అవకాశం ఇస్తున్నారు. బాబీ కొల్లితో చేస్తున్న సినిమా తర్వాత, ఈ ఇద్దరు సుకుమార్ శిష్యుల సినిమాలు పట్టాలెక్కనున్నాయి. ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. శ్రీకాంత్ ఒడేల, శ్రీనివాస్ వంటి టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్లతో మెగాస్టార్ చేస్తున్న ఈ ప్రయోగం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
READ ALSO: The Paradise: షాకింగ్ లీక్..ది ప్యారడైజ్’లో నాని నేపథ్యం ఇదే!