మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మాస్ స్వింగ్లో ఉన్నారు. ఈ సంక్రాంతికి (జనవరి 12, 2026) ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్న మెగాస్టార్, దీని తర్వాత తన 158 వ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు బాబీ కొల్లి తో చిరు చేస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్లో చిరుకి జోడిగా చాలా మంది హీరోయిన్ ల పేర్లు వినపడగా.. ఇప్పుడు ఏకంగా ప్రపంచ సుందరి పేరు వినపడుతుంది..
Also Read : Sreeleela :24 ఏళ్ల వయసులోనే గొప్ప నిర్ణయం తీసుకున్న శ్రీ లీల..
అవును ఈ మూవీలో చిరంజీవికి జంటగా ఐశ్వర్య రాయ్ రాబోతున్నట్లు వినిపిస్తున్న వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమా కేవలం క్యాస్టింగ్ పరంగానే కాకుండా టెక్నికల్ గానూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారని టాక్. అలాగే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక పవర్ఫుల్ క్యామియో రోల్ చేయనున్నట్లు సమాచారం. కోల్కతా బ్యాక్డ్రాప్లో సాగే ఒక రస్టిక్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా బాబీ ఈ కథను సిద్ధం చేశారట. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ చిరును ఒక వైల్డ్ లుక్లో చూపించబోతున్నట్లు హింట్ ఇచ్చింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రారంభమై, మార్చి 2026 నుంచి రెగ్యులర్ షూటింగ్కు వెళ్లే అవకాశం ఉందట.