టాలీవుడ్ లక్కీ భామ మీనాక్షి చౌదరి దశ తిరిగింది. ‘ఖిలాడి’, ‘హిట్ 2’, ‘గుంటూరు కారం’, ‘లక్కీ భాస్కర్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ హర్యానా బ్యూటీ, ఇప్పుడు బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీకి సిద్ధమైంది. హిందీ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘భాగమ్ భాగ్ 2‘ చిత్రంలో హీరోయిన్గా నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుంది. 2006లో అక్షయ్ కుమార్, గోవిందా, పరేష్ రావల్ కాంబినేషన్లో వచ్చిన ‘భాగమ్ భాగ్’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఇప్పుడు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వస్తున్న ఈ సీక్వెల్ను రాజ్ శాండిల్య తెరకెక్కిస్తున్నారు.ఒరిజినల్ మూవీ తరహాలోనే పక్కా కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కీలక పాత్రలో కనిపించబోతోంది.
Also Read : Toxic : టాక్సిక్ టీజర్ రిలీజ్.. థియేటర్స్ తగలబడతాయేమో
ఈ సినిమాలో మీనాక్షితో పాటు విలక్షణ నటుడు మనోజ్ బాజ్పాయ్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుండటం విశేషం. అంతేకాకుండా, బిగ్ బాస్ ఫేమ్ ఆయేషా ఖాన్ కూడా ఈ ప్రాజెక్ట్లో భాగం కానుంది. సీనియర్ నటుడు పరేష్ రావల్ ఈసారి డబుల్ రోల్లో కనిపించబోతున్నారని సమాచారం. వరుస సినిమాలతో బిజీగా ఉన్న మీనాక్షికి, అక్షయ్ కుమార్ వంటి టాప్ స్టార్ పక్కన అవకాశం రావడం ఆమె కెరీర్లో పెద్ద మైలురాయిగా మారనుంది. 2021లో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన మీనాక్షి, అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించే స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఆమె ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సినిమాలతో ఫుల్ ఫామ్లో ఉంది. ఇప్పుడు హిందీలో కూడా పాగా వేయాలని చూస్తోంది. ‘భాగమ్ భాగ్ 2’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమా సక్సెస్ అయితే బాలీవుడ్లో మీనాక్షికి మరిన్ని అవకాశాలు రావడం ఖాయం.