Meenakshi Chaudhary: సుశాంత్ తో డేటింగ్, పెళ్లి.. మీనాక్షి చౌదరి ఏమందంటే..!
- మొదటి సినిమా నుంచే ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం
- డేటింగ్, పెళ్లి పుకార్లలో ఎలాంటి నిజం లేదని ఖండన
- ఇండస్ట్రీలో పుకార్లు సహజమని, వాటిని చిటికెడు ఉప్పుగా తీసుకోవాలన్న వ్యాఖ్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meenakshi Chaudhary: హీరో సుశాంత్తో తనకు ఉన్న స్నేహం, డేటింగ్ పుకార్లు, వ్యక్తిగత జీవితం గురించి హీరోయిన్ మీనాక్షి చౌదరి స్పందించారు. ఇండస్ట్రీలో పుకార్లు సహజమని, వాటిని నియంత్రించడం ఎవరి వల్లా కాదని ఆమె అన్నారు. సుశాంత్ తనకు చాలా మంచి స్నేహితుడని, తన మొదటి సినిమా ఆయనే హీరోగా మొదలైందని మీనాక్షి తెలిపారు. ఆ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడిందని చెప్పారు. అయితే ఆ స్నేహాన్ని మించి ఏదైనా ఉందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు.
Steve Smith History: రికార్డులు తిరగరాసిన స్టీవ్ స్మిత్.. హాబ్స్, సచిన్, ద్రవిడ్ రికార్డ్స్ బ్రేక్!
Also Read
- PM Modi: "మనం ఇతర దేశాలపై ఆధారపడకూడదు".. దేశ ప్రజలకు ప్రధాని మోడీ కీలక సందేశం..
- Independence Day 2026: ఎర్రకోటపై ప్రధాని మోడీ జెండా ఆవిష్కరణ.. తొలిసారి మార్మోగిన ‘వందేమాతరం’..
- 48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- India Independence Day 1947: స్వాతంత్య్రపు తొలి ఉదయం.. ఢిల్లీ చూసిన ఆ అపూర్వ దృశ్యం
“పుకార్లను చిటికెడు ఉప్పుగా తీసుకోవాలి” అంటూ ఈ విషయమై నవ్వుతూ స్పందించారు. ఇండస్ట్రీలో పని చేసే సమయంలో మంచి మాటలూ ఉంటాయని, చెడు మాటలూ ఉంటాయని, మనల్ని ఇష్టపడేవాళ్లు ఉంటారని, ఇష్టపడనివాళ్లూ ఉంటారని మీనాక్షి పేర్కొన్నారు. అవి అన్నీ మన నియంత్రణలో ఉండవు. కాబట్టి వాటిని పెద్దగా పట్టించుకోకుండా మన పనిపై దృష్టి పెట్టడమే ముఖ్యం అని అన్నారు.
ఆరోగ్యం, క్రమశిక్షణ జీవితంలో ఎంతో కీలకమని ఆమె అన్నారు. ఏది తిన్నా శారీరక శ్రమ చేయడం తప్పనిసరిగా జీవితంలో భాగంగా ఉండాలన్నారు. పని, వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం అన్నీ సమతుల్యతతో ఉండాలని, సమయాన్ని గౌరవించడం, ఇతరుల సమయాన్ని గౌరవించడం చాలా ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. తప్పు చేయవద్దు, ఎవ్వరినీ మనకు తప్పు చేయనివ్వకూడదని తన తండ్రి నేర్పిన విలువలే తన జీవితానికి మార్గదర్శకమని మీనాక్షి అన్నారు. సులువైన పనులను కూడా 100 శాతం అంకితభావంతో చేయడమే జీవితం అసలు ఉద్దేశమని పేర్కొన్నారు.
Redmi Pad 2 Pro 5G: రెడ్మి ప్యాడ్ 2 ప్రో 5G టాబ్లెట్ రిలీజ్.. 12,000mAh బ్యాటరీ.. ధర ఎంతంటే?
పని చేస్తూ ఆనందాన్ని కోల్పోకూడదని, మనం చేసే పనినే ఆస్వాదిస్తే అదే జీవితాన్ని ఆస్వాదించినట్టేనని మీనాక్షి తెలిపారు. పని కోసం జీవించడం కాదు, పనిని ఆస్వాదిస్తూ జీవించడమే నిజమైన జీవితం అంటూ ఆమె వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
TV Ad Cap: 12 నిమిషాల యాడ్ రూల్కు కేంద్రం గుడ్బై.. టీవీ ఛానళ్లకు కొత్త నిబంధనలు
-
PM Modi: “మనం ఇతర దేశాలపై ఆధారపడకూడదు”.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ కీలక సందేశం..
-
Sreeleela: ముంబైలో సెట్స్పై శ్రీలీల.. కార్తీక్ మూవీ షూటింగ్ మళ్లీ స్టార్ట్!
-
Independence Day 2026: ఎర్రకోటపై ప్రధాని మోడీ జెండా ఆవిష్కరణ.. తొలిసారి మార్మోగిన ‘వందేమాతరం’..
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!