Madhya Pradesh Polls: మధ్యప్రదేశ్ ఎన్నికల అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసిన బీఎస్పీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh Polls: బహుజన్ సమాజ్ పార్టీ (BSP) ఈ ఏడాది చివరలో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం తన మొదటి ఏడుగురు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అభ్యర్థులను ప్రకటించిన ఏడు స్థానాల్లో ప్రస్తుతం నాలుగు అధికార బీజేపీ, మిగిలిన మూడు కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి.
తొలి జాబితాలోని అభ్యర్థుల పేర్లు: మొరెనా జిల్లాలోని డిమాని నుంచి పార్టీ మాజీ ఎమ్మెల్యే బల్వీర్ సింగ్ దండోటిత. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 2 వేలకు పైగా ఓట్లతో గెలుపొందారు. రేవా జిల్లాలోని సెమారియా స్థానం నుంచి పంకజ్ శర్మ అభ్యర్థిగా ఎంపికయ్యారు. అవదేశ్ ప్రతాప్ సింగ్ రాథోడ్, రామరాజా పాఠక్ వరుసగా నివారి, రాజ్నగర్-ఛతర్పూర్ స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. మిగిలిన ముగ్గురు అభ్యర్థులు – దేవ్రాజ్ అహిర్వార్ రైగాన్ స్థానం నుంచి, మణిరాజ్ సింగ్ పటేల్ రామ్పూర్ బఘేలాన్ స్థానం నుంచి, విష్ణు దేవ్ పాండే సిర్మూర్ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు. మణిరాజ్ సింగ్ పటేల్ రిటైర్డ్ నాయబ్ తహసీల్దార్ కాగా.. సిర్మూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీఎస్పీ అభ్యర్థి విష్ణు దేవ్ పాండే మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కావడం గమనార్హం.
Also Read
- Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
Also Read: Infosys Narayana Murthy: ఇండియాలో జనాభా నియంత్రణ అవసరం
మధ్యప్రదేశ్లో వింధ్య, గ్వాలియర్, చంబల్, బుందేల్ఖండ్లతో సహా ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలకు పరిమితమైన బీఎస్పీ, 2008 అసెంబ్లీ ఎన్నికల్లో 9 శాతం ఓట్లతో ఏడు స్థానాలను గెలుచుకుంది. ఐదేళ్ల తర్వాత ఆ సంఖ్య 6.20 శాతం ఓట్లతో కేవలం నాలుగు సీట్లకు పడిపోయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 5.01 శాతం ఓట్లతో కేవలం 2 సీట్లకు పరిమితమైంది. ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలలో ఒకరైన సంజీవ్ సింగ్ గత ఏడాది జూలైలో తన పాత పార్టీ అయిన బీజేపీలో చేరారు. రాష్ట్రంలో పార్టీకి ఇప్పుడు ఒకే ఒక్క ఎమ్మెల్యే మిగిలారు. మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లాలోని పఠారియా స్థానం నుండి మొదటిసారి శాసనసభ్యుడు అయిన రాంబాయి తాలూర్ ప్రస్తుతం బీఎస్పీ ఎమ్మెల్యేగా ఉన్నారు.

తాజావార్తలు
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!