Gold Smugglers : ముంబైలో భారీగా బంగారం పట్టివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Smugglers : ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ముగ్గురు విదేశీ ప్రయాణీకులు బంగారాన్ని షూలో దాచి తరలించే ప్రయత్నం చేశారు. కస్టమ్స్ అధికారులు రూ. 1.40 కోట్ల విలువ చేసే 3 కేజీల బంగారం సీజ్ చేశారు. ఈ ఘటనలో ముగ్గురు విదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.
Read Also: Kidnap: పెళ్లి పేరుతో బాలికలకు ఎర.. ఆ తర్వాత అస్సాంకే
Also Read
ఇది ఇలా ఉండగా.. శనివారం రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీగా బంగారం పట్టుబడింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, శ్రీకాకుళం రైల్వే స్టేషన్లలో దాదాపు తొమ్మిది కేజీలకు పైగా స్మగ్లింగ్ బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కోల్కతా నుంచి ఫలక్నుమా ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వద్ద 2.314 కిలోల స్మిగ్లింగ్ బంగారు కడ్డీలను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ.1.32 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
Read Also: Ukraine War: బఖ్ముత్లో మారణహోమం.. ఒక్క రోజులోనే 500 మంది రష్యా సైనికుల మరణం..
మరో కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం రైల్వేస్టేషన్లోనూ 7.396 కేజీల బంగారం పట్టుబడింది. చెన్నై మెయిల్ (హౌరా నుంచి చెన్నై) ద్వారా కోల్కతా నుంచి శ్రీకాకుళం రైల్వే స్టేషన్కు వచ్చిన ఒక వ్యక్తి వద్ద బంగారాన్ని అధికారులు గుర్తించారు. అనుమానాస్పదంగా కనిపిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని బ్యాగును క్షుణ్ణంగా వెతకగా.. ట్రాలీ బ్యాగ్ లోపలి జిప్ లైనింగ్ జేబులో ఈ బంగారం బయటపడింది. స్మగ్లింగ్ చేసిన ఈ బంగారం విలువ రూ.4.21 కోట్లుగా గుర్తించారు.
తాజావార్తలు
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
-
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
-
Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
-
Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? ‘ధురంధర్’ రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!