NTV Telugu Site icon

Delhi: బట్టల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న 8 ఫైరింజన్లు

Fke

Fke

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఢిల్లీలోని ప్రముఖ కరోల్ బాగ్ మార్కెట్‌లోని దుస్తుల షోరూమ్‌లో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖకు చెందిన ఎనిమిది వాహనాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా చనిపోయారా? లేదంటే ఎంత ఆస్తి నష్టం జరిగింది అన్న అంశంపై క్లారిటీ రావల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Rain: వానాకాలంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు ఇవే

ఇదిలా ఉంటే సోమవారం తెల్లవారుజామున ఢిల్లీలోని దుర్గాపురి ఎక్స్‌టెన్షన్ ఏరియాలో కూడా అగ్నిప్రమాదం జరిగింది. జ్యోతి నగర్‌లోని బేస్‌మెంట్‌లో గార్మెంట్ కంపెనీ షోరూమ్‌లో నాలుగు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. అపార్ట్‌మెంట్ వాసులను పోలీసులు ఖాళీ చేయించారు. ఒక వ్యక్తి కనిపించలేదని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: TFPC: డబ్బిచ్చినా పాయల్ సహకరించ లేదు.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక ప్రకటన