కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ వరుస సినిమాల తో దూసుకుపోతున్నాడు. తాజాగా విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోని.ఈ సినిమా తో విశాల్ సూపర్ హిట్ ను అందుకున్నాడు .ఈ సినిమా లో విశాల్ తో పాటు దర్శకుడు నటుడు ఎస్ జే సూర్య కూడా ఈ లో నటించారు. సెప్టెంబర్ 15 న థియేటర్ల లో విడుదలైన మార్క్ ఆంటోని సూపర్ హిట్ గా నిలిచింది.కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. థియేటర్స్ లో ఈ సినిమా కు మంచి క్రేజ్ లభించింది.విశాల్ ఈ సినిమా లో డిఫరెంట్ గెటప్స్ లో కనిపించి మెప్పించారు.థియేటర్ రన్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకొన్న మార్క్ ఆంటోని ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చింది.
టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా లో నటుడు సునీల్ ముఖ్య పాత్రలో నటించారు.డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ ఈ సినిమా కు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ను దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక మార్క్ ఆంటోని ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.ఇక ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.. నేటి నుంచి మార్క్ ఆంటోని సినిమాను అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు. తెలుగు, తమిళ్ భాషల్లో మార్క్ ఆంటోని మూవీ అందుబాటులో ఉంది. థియేటర్స్ లో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. ఎట్టకేలకు మార్క్ ఆంటోని మూవీ ఓటీటీ లోకి రావడం తో ప్రేక్షకులు ఎంతో ఎక్సయిట్ అవుతున్నారు.మరి ఈ సినిమా ఓటీటీ లో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
